మోడీ హామీలు…గాలిలో మేడలు : కేంద్రంపై రాహుల్ ఫైర్
మోడీ సర్కారుపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ, చైనాతో సరిహద్దు వివాదంపై గత కొంతకాలంగా ప్రభుత్వంపై రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న రాహుల్ తాజాగా… కరోనా సంక్షోభంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ట్వీట్ చేశారు.
21 రోజుల్లో కరోనాను ఓడిస్తామని గాలిలో మేడలు కట్టడం, ఆరోగ్య సేతు యాప్.. ప్రజలను రక్షిస్తుందని చెప్పడం, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ, మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదు.. అంతా నియంత్రణలోనే ఉంది.. అని ఇలా బీజేపీ అబద్ధాలు చెప్పింది. అయితే వీటన్నంటిలోనూ ఒక నిజం మాత్రం ఉంది. అదే ‘ఆపదలో అవకాశం’ #పీఎం కేర్స్ అంటూ రాహుల్ ట్వీట్ లో తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం రాహుల్ ఆమెకు తోడుగా అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.
మరోవైపు, చైనా వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ .. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించారని నిన్న రాహుల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పార్లమెంట్లో రక్షణమంత్రి చేసిన ప్రకటన ద్వారా అర్థమవుతోందన్నారు. అతి ముఖ్యమైన విషయంపై రక్షణమంత్రి ప్రకటన చేస్తున్న సమయంలో సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు లేరని రాహుల్ ప్రశ్నించారు.
అయితే, నిన్న రాజ్నాథ్ ప్రకటన అనంతరం.. ప్రశ్నలు వేయడానికి కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను అనుమతి కోరారు. అందుకు స్పీకర్ నిరాకరించారు. వెంటనే సభ నుంచి కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
कोरोना काल में भाजपा सरकार ने एक से एक ख़याली पुलाव पकाए:
▪️21 दिन में कोरोना को हरायेंगे
▪️आरोग्य सेतु ऐप सुरक्षा करेगा
▪️20 लाख करोड़ का पैकेज
▪️आत्मनिर्भर बनो
▪️सीमा में कोई नहीं घुसा
▪️स्थिति संभली हुई हैलेकिन एक सच भी था:
आपदा में ‘अवसर’ #PMCares— Rahul Gandhi (@RahulGandhi) September 16, 2020