దేశంలో తొలిసారి ఒకే రోజులో 25 వేలకు పైగా కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : July 10, 2020 / 10:17 AM IST
దేశంలో తొలిసారి ఒకే రోజులో 25 వేలకు పైగా కరోనా కేసులు

అమెరికా, బ్రెజిల్ తరువాత , భారతదేశంలోనే ప్రతిరోజూ అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. తొలిసారి 24 గంటల్లో 26 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పుడు కరోనా సోకిన వారి సంఖ్య ఎనిమిది లక్షలకు చేరుకుంది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 7 లక్షల 93 వేల 802 మందికి కరోనా సోకింది. వీరిలో 21,604 మంది చనిపోగా.. నాలుగు లక్షల 95 వేల మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 26 వేల 506 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 475మంది చనిపోయారు.

ప్రపంచంలో మూడవ అత్యంత ప్రభావిత దేశంగా భారత్..
ప్రపంచంలో భారతదేశం మూడవ అత్యంత కరోనా ప్రభావిత దేశంగా మారిపోయింది. బ్రెజిల్ తరువాత కరోనా మహమ్మారి వల్ల యునైటెడ్ స్టేట్స్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. భారతదేశం కంటే ఎక్కువ కేసులు అమెరికా (3,219,993), బ్రెజిల్ (1,759,103) లో ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం కూడా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.

రాష్ట్రాలవారీగా గణాంకాలు:

క్రమ సంఖ్య రాష్ట్రం పేరు మొత్తం కరోనా కేసులు
కోలుకున్నవారు చనిపోయినవారు
1 అండమాన్ నికోబార్ 151 63 0
2 ఆంధ్రప్రదేశ్ 23814 12154 277
3 అరుణాచల్ ప్రదేశ్ 302 120 2
4 అస్సాం 14032 8726 22
5 బీహార్ 13944 9816 115
6 చండీగఢ్ 523 403 7
7 ఛత్తీస్గఢ్ 3675 2903 15
8 ఢిల్లీ 107051 82226 3258
9 గోవా 2151 1273 9
10 గుజరాత్ 39194 27718 2008
11 హర్యానా 19369 14510 287
12 హిమాచల్ ప్రదేశ్ 1140 846 11
13 జమ్మూ కాశ్మీర్ 9501 5695 154
14 జార్ఖండ్ 3246 2208 23
15 కర్ణాటక 31105 12833 486
16 కేరళ 6534 3708 27
17 లడఖ్ 1055 915 1
18 మధ్యప్రదేశ్ 16341 12232 634
19 మహారాష్ట్ర 230599 127259 9667
20 మణిపూర్ 1450 799 0
21 మేఘాలయ 113 66 2
22 మిజోరం 197 133 0
23 ఒడిషా 11201 7407 52
24 పుదుచ్చేరి 1151 584 14
25 పంజాబ్ 7140 4945 183
26 రాజస్థాన్ 22563 17070 491
27 తమిళనాడు 126581 78161 1765
28 తెలంగాణ 30946 18192 331
29 త్రిపుర 1776 1338 1
30 ఉత్తరాఖండ్ 3305 2672 46
31 ఉత్తర ప్రదేశ్ 32362 21127 862
32 పశ్చిమ బెంగాల్ 25911 16826 854
భారతదేశంలో మొత్తం రోగుల సంఖ్య 793802 495513 21604