Kothapalli Geetha: బ్యాంకును మోసగించిన కేసులో.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు ఐదేళ్లు జైలుశిక్ష ..

అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత దంపతులను సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేసిన విషయం విధితమే. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. వారికి సీబీఐ న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష, లక్ష జరిమానా విధించింది.

Kothapalli Geetha: బ్యాంకును మోసగించిన కేసులో.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు ఐదేళ్లు జైలుశిక్ష ..

Kothapalli geetha

Kothapalli Geetha: అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత దంపతులను సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేసిన విషయం విధితమే. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నేషల్ బ్యాంక్ నుంచి రూ.52కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించక పోవటంతో గీత దంపతులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం వారిని అరెస్టు చేసిన అధికారులు.. వైద్య పరీక్షలకోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు, ఆమె భర్త రామకోటేశ్వరరావుకు ఐదేళ్ల జైలు శిక్ష రూ. లక్ష జరిమానా చొప్పున విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

EX MP Kothapalli Geetha Arrests : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు..

విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరుతో రుణం తీసుకున్న గీత దంపతులు.. బ్యాంకుకు ఎగనామం పెట్టారు. ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు గీత, ఆమె భర్తకు ఐదేళ్లు జైలు శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధించింది. ఈ స్కామ్‌కు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్‌కూ న్యాయస్థానం ఐదేళ్ల శిక్ష విధించింది. బ్యాంకుకు తప్పుడు వివరాలను అందించారని, బ్యాంకును మోసం చేశారని ఆరోపిస్తూ సీబీఐ 2015 జూన్‌ 30న గీత, ఆమె భర్త రామకోటేశ్వరావు తోపాటు మరో ముగ్గురుపై చార్జిషీట్‌ దాఖలు చేసింది.

Ahmedabad : 7వ అంతస్థు నుంచి కుప్పకూలిన లిఫ్ట్ .. ఎనిమిదిమంది దుర్మరణం

నాడు ఆమె భర్తను ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా నిర్ధారించి అతను బ్యాంకుకు రూ. 25.25 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించింది. కోర్టు గీతను నిర్దోషిగా ప్రకటించింది. అయితే నిర్దేశించిన గడువులోగా వీటిని చెల్లించకపోవడంతో ఇరువురిపై బ్యాంక్ అధికారులు మరోసారి కేసు నమోదు చేయగా, సీబీఐ కోర్టు బుధవారం దంపతులకు జైలు శిక్ష విధించింది.  గీత భర్త, బ్యాంకు అధికారులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదిలాఉంటే తెలంగాణ హైకోర్టులో గీత బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.