పెరిగిన రైల్వే ఛార్జీలు…అర్ధరాత్రి నుంచి అమల్లోకి
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో షాక్ ఇచ్చింది. స్వల్పంగా రైల్వే ఛార్జీలు పెంచింది.
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో షాక్ ఇచ్చింది. స్వల్పంగా రైల్వే ఛార్జీలు పెంచింది.
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో షాక్ ఇచ్చింది. స్వల్పంగా రైల్వే ఛార్జీలు పెంచింది. సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ కు కి.మీకు పైసా చొప్పున పెంచింది. మెయిల్ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ కు కి.మీకు 2 పైసలు పెంచారు. అదేవిధంగా ఏసీ ఛైర్ కార్, ఏసీ3, 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్ కు కి.మీకు 4 పైసల చొప్పున పెంచారు. పెరిగిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే సబర్బన్ రైళ్లలో ఛార్జీల పెంపుదల లేదని రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదాయం విషయంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రైల్వే శాఖ ఆదాయం గణనీయంగా తగ్గడంతో ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా రైల్వే ఛార్జీల పెంపుపై ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టికెట్ ధరలు పెంచుతూ మంగళవారం (డిసెంబర్ 31, 2019) రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. సబర్బన్(సింగిల్ జర్నీ ఫేర్), సీజన్ టికెట్లు(సబర్బన్ అండ్ నాన్ సబర్బన్) మినహా అన్ని క్లాస్ల్లో కిలోమీటర్కు కనీసం ఒక పైసా నుంచి 4 పైసలకు పెంచారు.
పెంచిన రైల్వే ఛార్జీలు 2020 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఛార్జీలను స్వల్పంగా పెంచింది. మోడీ ప్రభుత్వం తొలిసారి అధికారంలో వచ్చిన 2014లో చివరిసారిగా రైల్వే ఛార్జీలను పెంచారు. అప్పట్లో ప్రయాణికుల ఛార్జీలు 14.2 శాతం, సరకు రవాణా ఛార్జీలు 6.5 శాతం పెరిగాయి.