IPL media rights: ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించుకున్న డిస్నీ స్టార్, వయాకామ్18.. ఎంతకంటే..

ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించున్నది వీరే అంటూ బీసీసీఐ సెక్రటరీ జైషా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 2023 సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ టీవీ హక్కులు డిస్నీస్టార్ దక్కించుకుంది. డిజిటల్ హక్కులు రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్ 18 దక్కించుకుంది.

IPL media rights: ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించుకున్న డిస్నీ స్టార్, వయాకామ్18.. ఎంతకంటే..

Ipl

IPL media rights: ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించున్నది వీరే అంటూ బీసీసీఐ సెక్రటరీ జైషా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 2023 సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ టీవీ హక్కులు డిస్నీస్టార్ దక్కించుకుంది. డిజిటల్ హక్కులు రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్ 18 దక్కించుకుంది. భారీ పోటీ నడుమ భారీ మొత్తానికి ఐపీఎల్ మీడియా హక్కులను ఈ రెండు సంస్థలు దక్కించుకున్నాయి. ఫలితంగా ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకు రూ. 48,390 కోట్ల ($6.20 బిలియన్లు) భారీ మొత్తంలో సమకూరినట్లయింది.

తాజా సమాచారం ప్రకారం.. 2023 నుంచి 2027 సంవత్సరాలకు గాను నాలుగు ప్యాకేజీలుగా విభజించిన ఐపీఎల్ మీడియా హక్కులలో టీవీ ప్రసారాలను స్టార్ ఇండియా రూ. 23,575 కోట్లతో దక్కించుకుంది. అదేవిధంగా రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్18 డిజిటల్ హక్కులను రూ. 23,758 కోట్లతో దక్కించుకుందని. అయితే డిజిటల్ హక్కులలో వయాకామ్ తో పాటు టైమ్స్ ఇంటర్నెట్ కూడా భాగమైంది. మొత్తంగా నాలుగు ప్యాకేజీల ద్వారా బీసీసీఐకి రూ. 48,390 కోట్ల ఆదాయం చేకూరనుంది. ప్యాకేజీ A, Bకోసం ఒప్పందం ప్రకారం.. ఐదేళ్లలో 410 మ్యాచ్‌ల ఉంటాయి. 2023,2024లో ఒక్కొక్కటి 74మ్యాచ్‌లు, 2025, 2026లో ఒక్కొక్కటి 84 మ్యాచ్‌లు, 2027 ఎడిషన్‌లో 94 మ్యాచ్‌లు ఉంటాయి. ప్యాకేజీ C కూడా ఉంది. ఇక్కడ ప్రతి సీజన్‌కు Viacom18 ప్రత్యేకించి మార్క్యూ గేమ్‌ల డిజిటల్ హక్కులు ఉన్నాయి. Viacom18 ఒక్కో మ్యాచ్‌కి రూ. 33.24 కోట్ల చొప్పున రూ. 2991.6 కోట్ల విన్నింగ్ బిడ్‌తో గెలుచుకుంది. ఈ ప్యాకేజీలో 90 మ్యాచ్‌లు ఉన్నాయి. మరోవైపు ఆఫర్‌లో ఉన్న ఓవర్సీస్ టీవీ, డిజిటల్ హక్కులతో ఒక్కో గేమ్‌కు రూ. 3 కోట్ల బేస్ ధరతో ప్యాకేజీ D వయాకామ్ 18, టైమ్స్ ఇంటర్నెట్‌కు రూ. 1,300 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయి.

ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ విలువ గతంలో రూ54.5 కోట్ల నుండి రూ. 114 కోట్లకు సుమారు 100 శాతానికి పైగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా IPLలో ఒక్కో మ్యాచ్ విలువ ($14.61 మిలియన్లు) NFL లీగ్ తర్వాత రెండవ స్థానంలో ఉంది. ఇదిలాఉంటే స్టార్ ఇండియా రూ. 23,575 కోట్ల బిడ్‌తో ఇండియా టీవీ హక్కులను గెలుచుకున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నానని.. రెండు సంవత్సరాలు కొవిడ్ ఉన్నప్పటికీ BCCI యొక్క సంస్థాగత సామర్థ్యాలకు ఈ వేలం ప్రత్యక్ష నిదర్శనం అని BCCI కార్యదర్శి జే షా ట్వీట్ చేశారు.