IT Raids On Bogus Political Parties : దేశవ్యాప్తంగా బోగస్ రాజకీయ పార్టీలపై ఐటీ దాడులు .. రూ.కోట్ల విరాళాలు సేకరిస్తున్న పార్టీలకు చెక్

దేశ వ్యాప్తంగా ఉన్న బోగస్ రాజకీయపార్టీలపై ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈసీ జాబితాలో ఉండి గుర్తింపు పొందని పార్టీలే లక్ష్యంగా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.ఢిల్లీ, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, హర్యానాలతో సహా దాదాపు 12 రాష్ట్రాల్లో బోగస్ రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం సిఫార్సు ప్రకారం ఐటీ దాడులు కొనసాగిస్తోంది.

IT Raids On Bogus Political Parties :  దేశవ్యాప్తంగా బోగస్ రాజకీయ పార్టీలపై ఐటీ దాడులు .. రూ.కోట్ల విరాళాలు సేకరిస్తున్న పార్టీలకు చెక్

IT Raids On Bogus Political Parties

IT Raids On Bogus Political Parties : దేశ వ్యాప్తంగా ఉన్న బోగస్ రాజకీయపార్టీలపై ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈసీ జాబితాలో ఉండి గుర్తింపు పొందని పార్టీలే లక్ష్యంగా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.ఢిల్లీ, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, హర్యానాలతో సహా దాదాపు 12 రాష్ట్రాల్లో బోగస్ రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం సిఫార్సు ప్రకారం ఐటీ దాడులు కొనసాగిస్తోంది. ఆయా పార్టీల పేరుతో విరాళాలు సేకరిస్తున్నట్లుగా ఈ దాడుల్లో వెల్లడవుతున్నట్లుగా తెలుస్తోంది. వెరిఫికేషన్ సమయంలో పార్టీల జాడే తెలియటంలేదని ఈసీ చెబుతోంది. ఇలా రాజకీయ పార్టీల పేరుతో విరాళాలు సేకరిస్తున్నట్లుగా తెలిసింది. అలా అప్నాదేశ్ పార్టీకి మూడేళ్లలో రూ.380 కోట్ల విరాళాలు వచ్చినట్లుగా ఐటీ దాడుల్లో తేలింది.

పన్నెండుకుపైగా రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బోగస్ రాజకీయ పార్టీలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కొన్ని పార్టీలు నిబంధనలు పాటించకుండా విరాళాలు స్వీకరించి ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయపు పన్ను (ఐటీ) మినహాయింపును క్లెయిమ్ చేసిన పార్టీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ గత మే నెలలో చర్యలు తీసుకుంది. బోగస్ విరాళాలు, పన్నుల్లో మోసాలకు పాల్పడ్డారనే కారణాలతో 87 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించింది ఈసీ.

ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగా బోగస్ క్లెయిములు చేశారనే సమాచారం.. అనుమానం ఉన్న చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఐటీ మినహాయంపు.. ఎన్నికల సమయాల్లో సదుపాయాల కోసమే పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆర్ధిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు దుమారం చెలరేగిన క్రమంలో ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఎక్కడో దొరికిన ఆధారంగా పలు రాష్ట్రాల్లో తనిఖీలు చేయాల్సి వస్తోంది. దీంతో తొలుత 7 రాష్ట్రాల్లో మొదలైన సోదాలు.. 12 రాష్ట్రాలకు పెరిగింది. దేశ వ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాల్లో కూడా సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.