JK Dutt : మాజీ NSG చీఫ్ జేకే దత్ కన్నుమూత

ముంబై ఉగ్రదాడుల సమయంలో ఎన్​ఎస్​జీ కమాండోలకు నేతృత్వం వహించిన మాజీ డైరెక్టర్​ జనరల్​ జేకే దత్​​(72)​ కన్నుమూశారు.

JK Dutt : మాజీ NSG చీఫ్ జేకే దత్ కన్నుమూత

Jk Dutt

JK Dutt 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో ఎన్​ఎస్​జీ కమాండోలకు నేతృత్వం వహించిన మాజీ డైరెక్టర్​ జనరల్​ జేకే దత్​​(72)​ కన్నుమూశారు. కరోనా అనంతర సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మరణించారు.

కరోనా సోకిన జేకే దత్ ను ఆక్సిజన్​ స్థాయిలు పడిపోతుండడం వల్ల ఏప్రిల్​ 14న గుర్​గావ్​లోని మేదాంతా ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వాత కోలుకున్నారని..అయితే కరోనా అనంతర సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నాం 3:30గంటల సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని తెలిపారు. ​ జేకే దత్ కు భార్యా,కుమారుడు,కూతురు ఉన్నారు. కుమారుడు నోయిడాలో ఉద్యోగం చేస్తుండగా,కూతరు యూఎస్ లో ఉంటోంది.