Kavach : కవచ్ ఉన్నా.. ప్రమాదం జరిగేదా? అసలు ఏంటీ కవచ్? రైలు ప్రమాదాలను ఎలా అరికడుతుంది?

Kavach : ఇంతటి ఘోర రైలు ప్రమాదానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? తప్పు ఎవరిది? కవచ్ వ్యవస్థ ఉంటే ఇంతటి ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదా?

Kavach : కవచ్ ఉన్నా.. ప్రమాదం జరిగేదా? అసలు ఏంటీ కవచ్? రైలు ప్రమాదాలను ఎలా అరికడుతుంది?

Kavach

Kavach – Odisha Train Accident : ఒక్క ప్రమాదం.. అనేక ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు.. ఒడిశాలో ఘోర రైళ్ల ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మూడు రైళ్లు ప్రమాదానికి గురి కావడం, భారీగా ప్రాణ నష్టం సంభవించడం దేశ ప్రజలకు షాక్ కి గురి చేసింది. అంతా నిమిషాల్లోనే ఘోరం జరిగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంతటి ఘోర రైలు ప్రమాదానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? తప్పు ఎవరిది? కవచ్ వ్యవస్థ ఉంటే ఇంతటి ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదా? రైల్వే శాఖ ఏమంటోంది..

కవచ్ వ్యవస్థ ఉండి ఉంటే ఒడిశా రైలు ప్రమాదం జరిగేది కాదని ప్రతిపక్షాలు అంటుంటే, కవచ్ సిస్టమ్ ఉన్నా ఈ ప్రమాదాన్ని ఆపేది కాదని రైల్వేశాఖ అధికారులు అంటున్నారు. అసలు ఒడిశా రైలు ప్రమాదానికి కారణాలు ఏంటి? ఒక్క ప్రమాదంలో మూడు రైళ్లు ఇన్వాల్స్ అయి ఉండటం ఏంటి? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.

Also Read..Life Insurance Corporation : ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా ఎల్ఐసీ

అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్న ఇండియన్ రైల్వేస్ కూడా ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడం లేదు. సిగ్నలింగ్ ఫెయిల్యూల్ అని ఒకసారి, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో మార్పు వల్ల ప్రమాదం జరిగిందని మరోసారి చెబుతున్నారు. సిగ్నలింగ్ ఫెయిల్యూర్ అని ప్రాథమిక దర్యాఫ్తులో తేల్చారు. ఇంకా పూర్తి స్థాయి దర్యాఫ్తు కొనసాగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. ఇలా అనేక రకాల ఊహాగానాలు, ఎన్నో అంతుచిక్కని అనుమానాలకు కేరాఫ్ గా మారింది ఒడిశా రైలు ప్రమాదం.

ఒడిశా ఘోర రైలు ప్రమాదం విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైలు ప్రమాదాల నివారణ కోసం కవచ్ వ్యవస్థ తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకున్న కేంద్రం.. రైలు ప్రమాదాలు జరక్కుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందని ప్రశ్నిస్తున్నారు. బాలాసోర్ ప్రాంతంలో కవచ్ సిస్టమ్ లేదని, ఒకవేళ కవచ్ ఉంటే ప్రమాదమే జరిగి ఉండేది కాదంటున్నారు. వందల మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదంటున్నారు ప్రతిపక్షాల నేతలు.

Also Read..Railway Insurance : రూపాయి కన్నా తక్కువ మొత్తంతో రూ.10 లక్షలు రైల్వే బీమా .. ఎలా అప్లై చేసుకోవాలంటే?

అయితే, ఒడిశా రైలు ప్రమాదానికి, కవచ్ వ్యవస్థకు సంబంధమే లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. కవచ్ ఉన్నా ఒడిశా రైలు ప్రమాదం జరిగేది ఆయన తేల్చి చెప్పారు. సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ తో పాటు ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ కారణంగా ప్రమాదం జరిగిందంటున్నారు. ఈ రెండింటికి కవచ్ వర్తించదని ఆయన స్పష్టం చేశారు.

అసలు కవచ్ ఏంటి? కవచ్ సిస్టమ్ రైల్వే ప్రమాదాలను ఎలా అరికడుతుంది?
ఇప్పుడు ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ఈ కవచ్ సిస్టమ్ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఉన్నప్పుడు అవి ఢీకొనకుండా ఆపేందుకు రైల్వే శాఖ కవచ్ టెక్నాలజీని 2022లో తీసుకొచ్చింది. కవచ్ టెక్నాలజీ ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ. రైలు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్రం రూ.400 కోట్లు ఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని తీసుకొచ్చింది.

* రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్ గా ఆగిపోయేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది.
* అలాగే రైళ్లను ఈ టెక్నాలజీ వెనక్కి నడిపిస్తుంది. అందువల్ల రైళ్లు ఢీకొనవు.
* రెడ్ సిగ్నల్ పడినా లోకోపైలెట్ పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళితే ఎదురుగా ఇంకో రైలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రెండు రైళ్ల స్పీడ్ ని తగ్గించి ప్రమాదం జరక్కుండా చూస్తుంది ఈ కవచ్ సిస్టమ్.
* ట్రాక్ బాగోలేకపోయినా, టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నా ఆటోమేటిక్ గా బ్రేకులేస్తుంది ఈ కవచ్ సిస్టమ్.
* వంతెనలు, మలుపుల దగ్గర రైలు స్పీడ్ ని తగ్గిస్తుంది.

కవచ్.. ఓ హై టెక్నాలజీ. అందులో డౌట్ లేదు. రైలు ప్రమాదాలను అరికడుతుందని చెప్పడంలో సందేహమే లేదు. అయితే, ఒడిశా రైలు ప్రమాదం మాత్రం ఈ కవచ్ సిస్టమ్ పరిధిలో జరగలేదని చెబుతోంది రైల్వేశాఖ. కవచ్ సిస్టమ్.. ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు మాత్రమే పని చేస్తుందని వివరిస్తున్నారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు.. సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్యూర్ కారణంగా లూప్ లైన్ లోకి వెళ్లిందని.. అప్పటికే లూప్ లైన్ లో గూడ్స్ రైలు ఆగి ఉంది.

120 కిలోమీటర్ల స్పీడ్ తో ఉన్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్.. గూడ్స్ రైలుని ఢీకొట్టి పట్టాలు తప్పింది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు గాల్లోకి ఎగిరి అవతలి పట్టాలపై వస్తున్న బెంగళూరు ఎక్స్ ప్రెస్ బోగీలపై పడ్డాయి. దాంతో బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులోని మూడు బోగీలో బోల్తాపడ్డాయి. ఆ ట్రైన్ లో ఉన్న వారికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం.. కవచ్ సిస్టమ్ ఉన్నా జరిగేదని, కవచ్ సిస్టమ్ ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే పని చేస్తుందని రైల్వేశాఖ చెబుతోంది.