‘చివరి గుడ్ మార్నింగ్’ అంటూ పోస్టు పెట్టి తుదిశ్వాస విడిచిన వైద్యురాలు

ముంబైలో 51 ఏళ్ల వైద్యురాలు COVID-19 తో మరణించారు. అయితే అంతకుముందు ఫేస్‌బుక్‌లో ఓ భావోద్వేగ పోస్టును పంచుకున్నారామె..

‘చివరి గుడ్ మార్నింగ్’ అంటూ పోస్టు పెట్టి తుదిశ్వాస విడిచిన వైద్యురాలు

Dr Manisha Jadhav

Dr Manisha Jadhav : ముంబైలో 51 ఏళ్ల వైద్యురాలు COVID-19 తో మరణించారు. అయితే అంతకుముందు ఫేస్‌బుక్‌లో ఓ భావోద్వేగ పోస్టును పంచుకున్నారామె.. డాక్టర్ మనీషా జాదవ్ ముంబై నగరంలోని సేవ్రి టిబి ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్.. అంతేకాదు ఆమె క్షయవ్యాధి నిపుణురాలు కూడా.. అయితే గతకొద్ది రోజులుగా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు.. ఈ క్రమంలో ఆమె కూడా కరోనా బారిన పడటంతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే సోమవారం నుంచి ఆమె ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్నీ గమనించిన మనీషా జాదవ్ తన ఫేస్‌బుక్‌లో చివరి పోస్టు చేశారు..

అందులో.. బహుశా ఇది చివరి గుడ్ మార్నింగ్ కావచ్చు. ఇక నేను మిమ్మల్ని ఇక్కడ(ఫేస్‌బుక్‌లో) కలవలేకపోవచ్చు.. అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. బాడీ డై అంటూ పోస్టు చేశారు.. ఇది చూసిన స్నేహితులు.. మీకేమి కాదు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని పోస్టు చేశారు.. కానీ ఆమె తిరిగిరాలేదు.. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన సుమారు 36 గంటల తరువాత చనిపోయారు. దీంతో ఆమె స్నేహితులు అందరూ తీవ్ర విషణ్ణవదనంలో మునిగిపోయాయారు.