నా కూతురు పేగుల్ని లాగిన కిరాతకులు వేదాలు వల్లిస్తున్నారు : అక్షయ్‌ పిటిషన్‌పై నిర్భయ తల్లి ఆగ్రహం

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 05:08 AM IST
నా కూతురు పేగుల్ని లాగిన కిరాతకులు వేదాలు వల్లిస్తున్నారు : అక్షయ్‌ పిటిషన్‌పై నిర్భయ తల్లి ఆగ్రహం

నా కూతురు పేగుల్ని బయటకు లాగి..అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన దుర్మార్గులు ఇప్పుడు ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారనీ..తన బిడ్డపై అనాగరికంగా..అత్యంత ఘోరంగా దాడికి పాల్పడినప్పుడు వారికి మానవ హక్కుల సంగతి గుర్తుందా? అంటూ నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురు పడిన శారీరక..మానసిక వేదనకు తగిన న్యాయం జరిగేలా నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్షను నిర్ణయించిన డిసెంబర్ 16నే వారిని ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. 

2012 డిసెంబరులో.. దేశ రాజధాని ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన దోషుల్లో ఒకడైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌..తనకు  క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటీషన్ లో వేదాలు, పురాణాలను గురించి ప్రస్తావించిన విషయం..ఢిల్లీలో వాయు,నీటి కాలుష్యం వల్ల ఎలాగూ జీవితం హరించుకుపోతున్నది. ఇక ఉరిశిక్షలు ఎందుకు? అని ప్రస్తావించడంపై నిర్భయ తల్లి తీవ్రంగా మండిపడ్డారు.

నిర్భయ దోషఉలకు మరణానికి కారకులైనవారికి మానవహక్కులు అంటూ నీతులు వల్లించటానికి స్వేచ్ఛ ఉంటుంది..కానీ బాధితులకు..వారి కుటుంబాలకు మాత్రం మానవహక్కులూ అంటూ తర్కం చెబుతారా? బాధితులకు మాత్రమే ఇవి వర్తిస్తాయా? అంటూ నిప్పులు చెరిగారు. నిర్భయ నిందితులు ఎంతమాత్రం క్షమాభిక్షకు అర్హులు కారనీ వాళ్లను డిసెంబరు 16నే ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు.