PM Modi : ఏపీ సహా ఆరు రాష్ట్రాల సీఎంల‌తో నేడు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

క‌రోనా ప‌రిస్థితులపై ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

PM Modi : ఏపీ సహా ఆరు రాష్ట్రాల సీఎంల‌తో నేడు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

Pm Narendra Modi To Meet Chief Ministers Of Six States Today

PM Narendra Modi : క‌రోనా ప‌రిస్థితులపై శుక్రవారం (జూలై 16) ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ప్రతిరోజు రికార్డు అవుతున్న కరోనా కేసుల్లో ఈ ఆరు రాష్ట్రాల నుంచే 75శాతం కేసులు నమోదవుతున్నాయి. దీంతో సంబంధిత రాష్ట్రాలను అ్రపమత్తం చేసేందుకు మోదీ ఈ వర్చువల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు.

కోవిడ్‌ పరిస్థితులు, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. తదితర అంశాలపై సీఎంలతో మోదీ చర్చించనున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి శ‌ర‌వేగంగా రూపాంతరం చెందుతుండడంతో.. రాష్ట్రాల్లో క‌ఠిన ప‌ర్యవేక్షణ ఉండాల‌ని, అన్ని రకాల వేరియంట్లను సునిశితంగా ప‌రిశీలించాల‌ని ఈ స‌మావేశంలో సీఎంలకు ప్రధాని సూచించ‌నున్నారు. క‌రోనా వేరియంట్లు, వాటి ప్రభావంపై నిపుణులు అధ్యయ‌నం చేస్తున్న విష‌యాన్ని వారికి వివ‌రించ‌నున్నారు.

ప్రస్తుత ప‌రిస్థితుల్లో క‌రోనా క‌ట్టడికి నివార‌ణ‌, చికిత్స కీల‌క‌మ‌ని, అంద‌రూ త‌ప్పనిస‌రిగా కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్రధాని సూచించ‌నున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఈశాన్య రాష్ట్రాల‌కు చెందిన ఎనిమిది మంది సీఎంల‌తో మోదీ ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.