Pune : BTSపై పిచ్చి.. 500 రూపాయలతో పూణే నుంచి సౌత్ కొరియాకు పయనమైన బాలికలు.. చివరికి ఏమైందంటే?
ఇద్దరు బాలికలు పూణే నుంచి సౌత్ కొరియాకు రూ.500 లతో బయలుదేరారు. సంగీతం నేర్చుకోవాలనే వ్యామోహంతో ముందు వెనుకా ఆలోచించకుండా.. ఇంట్లో చెప్పకుండా బయలుదేరిన వారి ప్రయాణం చివరికి ఏమైంది?

Pune
Pune Girls : ఇద్దరు బాలికలు.. వయసు 13 ఏళ్లు.. ఉండేది పూణేలో.. BTS మ్యూజిక్ అంటే పిచ్చి. చేతిలో రూ.500 ఉన్నాయి.. దక్షిణ కొరియాకు వెళ్లాలని ప్రయాణం అయ్యారు. అంత సాహసం చేయగలిగారా? చదవండి.
Andhra Pradesh: బాలికలు, మహిళల మిస్సింగ్పై సంచలన విషయాలు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
బీటీఎస్ బ్యాండ్ (BTS) .. పాప్ మ్యూజిక్ ఇష్టపడే వారికి ఈ సౌత్ కొరియన్ బ్యాండ్ గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్యాండ్కి అభిమానులు ఉన్నారు. అలా పూణేలో ఉండే ఇద్దరు బాలికలు ఈ బ్యాండ్ మ్యూజిక్ మీద మనసు పారేసుకున్నారు. అంతేకాదు వారి దగ్గర సంగీతం నేర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. చేతిలో ఉన్న రూ.500 లతో సౌత్ కొరియాకు వెళ్లాలని ప్రయాణం అయ్యారు. పెద్ద సాహసమే కదా.
టింగ్రేనగర్ కి చెందిన 13 ఏళ్ల ఇద్దరు బాలికలు BTS మ్యూజిక్ మీద ఉన్న అభిమానంతో దక్షిణ కొరియాకు బయలుదేరారు. వీరిద్దరు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశ్రాంత్ వాడీ పోలీస్ స్టేషన్ కు చెందిన API అన్సారీ షేక్ తీవ్రంగా శ్రమించి మొత్తానికి వారిని ముంబయిలో గుర్తించారు. బాలికలను క్షేమంగా వారి ఇళ్లకు చేర్చారు. అసలు వారి ప్రయాణం ఎలా మొదలైందంటే?
YS Sharmila : తెలంగాణలో 40వేల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్- సీఎం కేసీఆర్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
బాలికల్లో ఒకరికి తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ దగ్గర ఉంటోంది. మందులు, కిరాణా సామాన్లు కొనేందుకు అమ్మమ్మ రూ.500 నోటు ఇచ్చింది. డబ్బులు తీసుకుని ఆమె తన స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది. ఇద్దరికి BTS మ్యూజిక్ అంటే మహా పిచ్చి కావడంతో ఎలాగైనా ఆ బ్యాండ్ సభ్యులను కలవాలని అనుకున్నారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఎటువంటి ప్లాన్ లేకుండా రూ.500 లతో ప్రయాణం మొదలుపెట్టారు. పూణే రైల్వే స్టేషన్కు చేరుకున్న ఇద్దరు ముంబయి ట్రైన్ ఎక్కారు. దాదర్ రైల్వే స్టేషన్కి చేరాక వారికి ఎక్కడికి వెళ్లాలో అర్ధం కాలేదు. డబ్బులు అయిపోయి కష్టాలు మొదలయ్యాయి.
క్యాబ్ ఎక్కిన ఇద్దరు బాలికలు క్యాబ్ డ్రైవర్ ఫోన్తో అమ్మమ్మకి ఫోన్ చేయడానికి ప్రయత్నించినా ఆమె రెస్పాండ్ కాలేదు. కాసేపటికి మిస్డ్ కాల్ చూసుకున్న ఆమె పోలీసులకు చెప్పింది. బాలికలను మాటల్లో పెట్టి ఆ బాలికలను సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్పగించాలని క్యాబ్ డ్రైవర్ కు పోలీసులు సూచించారు. ఆ క్యాబ్ డ్రైవర్ బాలికల్ని ముంబయి ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. మొత్తానికి బాలికలను క్షేమంగా వారి ఇళ్లకు చేర్చారు పోలీసులు.
బాలికల మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే పోలీసులు స్పందించిన తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వీరి మిస్సింగ్ సమాచారాన్ని రైల్వే పోలీసులు, బస్ స్టేషన్లు, వైర్ లెస్ నెట్వర్క్లకు అందించి వారిని అప్రమత్తం చేశారు. పోలీసు అధికారి అన్సార్ షేక్ బాలికలను ఇంటికి చేర్చేవరకు కీలక పాత్ర వహించారు. ఈ మొత్తం ఘటనను సంబంధించిన సమాచారాన్ని ‘పూనే టైమ్స్ మిర్రర్’ ప్రచురించింది.