Police lathi charge : హర్యానా రైతులపై పోలీసుల లాఠీ చార్జ్..పలువురికి గాయాలు

హర్యానాలో పోలీసులు రైతులపై లాఠీ చార్స్ చేశారు. ఆదివారం (మే 16,2021) కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించటానికి వెళ్లిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను రైతులు ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీ చార్జ్ చేశారు. భాష్పవాయువు ప్రయోగించారు.

Police lathi charge : హర్యానా రైతులపై పోలీసుల లాఠీ చార్జ్..పలువురికి గాయాలు

Police Lathi Charge To Farmers

Police lathi charge to farmers  : హర్యానాలో పోలీసులు రైతులపై లాఠీ చార్స్ చేశారు. ఆదివారం (మే 16,2021) కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించటానికి వెళ్లిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను రైతులు ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీ చార్జ్ చేశారు. భాష్పవాయువు ప్రయోగించారు. హర్యానాలోని హన్సిలో వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ తో కోవిడ్ సెంటర్ ను ప్రారంభించినటానికి వచ్చిన సీఎంను రైతులు చుట్టుముట్టారు. సాగు చట్టాలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ సీఎంను ఘెరావ్ చేశారు.

దీంతో పోలీసులు రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు రైతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తాలు కారాయి. అది చూసిన రైతులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను లాగిపారేశారు. దీంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు.

సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని సింఘూ, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళనను విరమించాలని కేంద్రం విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. వారి ఆందోళనను కొనసాగిస్తునే ఉన్నారు.ఇన్నాళ్లు రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తన తీరును మార్చుకోవటంలేదు. అయినా రైతులు మాత్రం తమ డిమాండ్స్ నెరవేర్చేవరకూ ఆందోళన విరమించేది లేదంటున్నారు.