Rahul Gandhi : దేశ ప్రజలందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి : రాహుల్ గాంధీ డిమాండ్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పౌరులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత టీకా కార్యక్రమంలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు
Rahul Gandhi Free Vaccination to All : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పౌరులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత టీకా కార్యక్రమంలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. దేశ పౌరులందరూ ఉచితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని రాహుల్ పిలుపునిచ్చారు. భారతదేశాన్ని బిజెపి వ్యవస్థకు బాధితులుగా చేయవద్దని హిందీలో ట్వీట్ చేశారు.
మహమ్మారి నిజంగా నియంత్రించమన్న సత్యాన్ని కనీసం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని విరుచుకుపడ్డారు. ఉపాధి, అభివృద్ధి మాదిరిగా, కేంద్ర ప్రభుత్వం కరోనా నిజమైన డేటాను ప్రజలకు చేరనివ్వడం లేదని మండిపడ్డారు. అందరికీ ఉచితంగా టీకాలు వేయాలని రాహుల్ గాంధీ తమ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాయని తెలిపారు.
దేశంలో ప్రభుత్వ టీకా విధానంపై, COVID పరిస్థితిని నియంత్రించడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దేశంలో కేసులు, మరణాల సంఖ్యలో ముందున్న మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, అస్సాం అనేక ఇతర రాష్ట్రాలు అందరికీ ఉచిత టీకాలు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. నాలుగు రాష్ట్రాలు తయారీదారుల నుండి వ్యాక్సిన్ నిల్వలను “హైజాక్” చేస్తున్నాయని ఆరోపించాయి.
మే 1 నుంచి 18-45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిందరికి టీకాల డ్రైవ్ ప్రారంభించగలరా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. మహమ్మారి తీవ్రతపై నిజాన్ని కప్పేస్తున్నారని, మరణాల సంఖ్య తక్కువగా నివేదిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.