RapidX Train now NaMo Bharat: రాపిడ్ ఎక్స్ రైళ్లకు నమో భారత్ అని పేరు మార్పు.. రేపే ప్రధాని మోదీచే ప్రారంభం

ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్‌లోని 17 కి.మీ పొడవైన సాగే మొదటి దశలో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధార్, దుహై, దుహై డిపో ఐదు స్టేషన్లను కవర్ చేస్తుంది.

RapidX Train now NaMo Bharat: రాపిడ్ ఎక్స్ రైళ్లకు నమో భారత్ అని పేరు మార్పు.. రేపే ప్రధాని మోదీచే ప్రారంభం

Updated On : October 19, 2023 / 7:00 PM IST

RapidX Train now NaMo Bharat: ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) రైళ్లను ఇక నుంచి నమో భారత్ అని పిలవాలి. ఈ విషయమై అధికార వర్గాలు గురువారం ఉత్తర్వులు జారీ చేశాయి. కాగా, శుక్రవారం(అక్టోబర్ 20)న ప్రధాని నరేంద్ర మోదీ వీటిని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే వీటి పేరు మారడం గమనార్హం.

ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్‌లోని 17 కి.మీ పొడవైన సాగే మొదటి దశలో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధార్, దుహై, దుహై డిపో ఐదు స్టేషన్లను కవర్ చేస్తుంది. ఈ మార్గం 2025 సంవత్సరంలోగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్టోబర్ 12వతేదీన ప్రారంభానికి ముందు ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) ప్రాజెక్ట్ సాహిబాబాద్ స్టేషన్‌ను పరిశీలించారు.

ఢిల్లీ నుంచి మీరట్‌కి కేవలం 60 నిమిషాల్లో ఈ హై-స్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ చేరనుంది. భారత ప్రభుత్వం, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల జాయింట్ వెంచర్ అయిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.

2019వ సంవత్సరంలో ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్ఆర్ టీఎస్ కారిడార్ నిర్మాణం ప్రారంభమైంది. ఆర్‌ఆర్‌టిఎస్ రైలు ఫస్ట్ లుక్‌ను ఏడాది తర్వాత ఆవిష్కరించారు. ఈ మెట్రో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ఆర్‌ఆర్‌టిఎస్ స్టేషన్‌లలో లోతైన బహుళ-మోడల్ ఇంటిగ్రేషన్‌ను అభివృద్ధి చేశారు. ఈ ఆర్ఆర్ టీఎస్ స్టేషన్లు వివిధ మెట్రో లైన్లు, విమానాశ్రయాలు, బస్టాండ్‌లతో ఏకీకృతం చేశారు.