Rishi Sunak: భారత్‌కు అల్లుడిని: ఢిల్లీలో రిషి సునక్ ఆసక్తికర కామెంట్స్

జీ20 సదస్సులో పాల్గొనకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.

Rishi Sunak: భారత్‌కు అల్లుడిని: ఢిల్లీలో రిషి సునక్ ఆసక్తికర కామెంట్స్

Rishi Sunak: న్యూ ఢిల్లీ(New Delhi)లో నిర్వహిస్తున్న జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ (43) భారత్ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాక మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత్‌కు తాను అల్లుడినని రిషి సునక్ అన్నారు. తాను భారత్ కు అల్లుడినని ఎక్కడో రాశారని, అది తాను చూశానని వివరించారు. ఈ పర్యటన తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. ఇండియాకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారత్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు.

జీ20 సదస్సుపై పూర్తిగా దృష్టి పెట్టి తాను అందులో పాల్గొంటున్నానని తెలిపారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ సత్సంబంధాలు, హాని ఉన్న దేశాలకు మద్దతు తెలపడం వంటి వాటిపై చర్చిస్తామన్నారు. జీ20 సదస్సులో పాల్గొనకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.

కాగా, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి సునక్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అక్షత మూర్తితో కలిసి రిషి సునక్ భారత్ వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ధ్వైపాక్షిక చర్చల్లోనూ రిషి సునక్ పాల్గొంటారు.

G20 dinner : జి 20 డిన్నర్‌కు మన్‌మోహన్ సింగ్, దేవగౌడ, నితీష్ కుమార్‌కు ఆహ్వానం