Supreme Court: క్షమాపణ చెప్పి తప్పించుకోలేరు.. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సుప్రీం సీరియస్
ప్రపంచంలోని ప్రతి వ్యక్తి జీవితాన్ని సోషల్ మీడియా సంగ్రహించిన యుగంలో మనం జీవిస్తున్నాం. సోషల్ మీడియాలో పంపిన/ఫార్వార్డ్ చేసి సందేశం ఏ సమయంలోనైనా ప్రపంచానికి చేరుకుంటుంది. చేరుకోగలదు.
SV Shekar: నటుడు, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఆ సమయంలో సోషల్ మీడియా వినియోగదారులు దాని ప్రభావం, రీచ్ గురించి జాగ్రత్తగా ఉండాలని కోర్టు చురకలు అంటించింది. జూలై 14న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై శేఖర్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. వాస్తవానికి, ఆయన షేర్ చేసిన పోస్ట్కు సంబంధించిన క్రిమినల్ ప్రొసీడింగ్లను రద్దు చేయాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
అటువంటి పదవిలో ఉన్న నిందితులను శిక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి సందర్భాలలో కేవలం క్షమాపణ చెప్పడం పనికిరాదని, అలాంటి వ్యక్తులు క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. “ఒకవేళ సోషల్ మీడియాను ఉపయోగిస్తే, దాని ప్రభావం, రీచ్ గురించి జాగ్రత్తగా ఉండాలి” అని పిటిషనర్ తరపు న్యాయవాదికి ధర్మాసనం తెలిపింది. సంఘటన జరిగిన తేదీపై శేఖర్ దృష్టిలో ఏదో ఉందని లాయర్ వాదించారు. ఆయన షేర్ చేసిన పోస్ట్ను చదవలేదని చెప్పారు. సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది. ఎవరైనా సోషల్ మీడియాను ఉపయోగించాల్సిన అవసరం ఉందని భావిస్తే, పరిణామాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది.
Minister KTR : హిందు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ పని : మంత్రి కేటీఆర్
శేఖర్ తన ఫేస్బుక్ ఖాతాలో ఏప్రిల్ 19, 2018న అవమానకరమైన అసభ్యకరమైన వ్యాఖ్యను పోస్ట్ చేశారని, ఆ తర్వాత చెన్నై పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో శేఖర్పై ఇతర ప్రైవేట్ ఫిర్యాదులు కూడా నమోదయ్యాయని కోర్టు పేర్కొంది. పోస్ట్లో ఉన్న అవమానకరమైన వ్యాఖ్యల గురించి తెలుసుకున్న శేఖర్ అదే రోజు కొన్ని గంటల్లో పోస్ట్ను తొలగించారని, ఆపై 2018 ఏప్రిల్ 20 నాటి లేఖ రాశారని, అందులో అతను బేషరతుగా సంబంధిత మహిళకు క్షమాపణలు చెబుతున్నాడని శేఖర్ తరపు న్యాయవాది తెలిపారు. సదరు జర్నలిస్టుకు, మీడియాకు క్షమాపణలు చెప్పారు.
Meta : ఉద్యోగులకు మెటా వార్నింగ్, మూడు రోజులు ఆఫీసుకు రాకపోతే ఉద్యోగం నుంచి ఊస్టింగ్
కేసు పెండింగ్లో ఉన్న సమయంలో క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ను దాఖలు చేయాలని పిటిషనర్ను ఆదేశించామని, దానిని తాను చేశానని న్యాయవాది పేర్కొన్నట్లు హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘‘ఏప్రిల్ 19, 2018 నాటి పిటిషనర్ ఫేస్బుక్ ఖాతా ద్వారా షేర్ చేసిన పోస్ట్లో మహిళా జర్నలిస్టుల ఇమేజ్ను కించపరిచేలా ఉంది. పిటిషనర్ పంపిన సందేశాన్ని అనువదించడానికి కోర్టు కూడా చాలా వెనుకాడుతోంది, ఎందుకంటే ఆయన అసహ్యంగా ఉంది. ఈ పోస్ట్ తమిళనాడులోని అన్ని పత్రికలకు చాలా పరువు నష్టం కలిగించింది” అని కోర్టు పేర్కొంది.
Asaduddin Owaisi: ఒకరు చౌకీదార్, ఇంకొకరు దుకాణ్దార్.. మోదీ, రాహుల్ మీద ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
ఇంకా కోర్టు స్పందిస్తూ.. “ప్రపంచంలోని ప్రతి వ్యక్తి జీవితాన్ని సోషల్ మీడియా సంగ్రహించిన యుగంలో మనం జీవిస్తున్నాం. సోషల్ మీడియాలో పంపిన/ఫార్వార్డ్ చేసి సందేశం ఏ సమయంలోనైనా ప్రపంచానికి చేరుకుంటుంది. చేరుకోగలదు. స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు లేదంటే, ఏదైనా పోస్ట్లను షేర్ చేసేటప్పుడు పిటిషనర్ తన పదవిని దృష్టిలో ఉంచుకుని మరింత బాధ్యత వహించాలి. సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ అంటే తుపాకి నుంచి వెళ్లిన బుల్లెట్. జరిగే నష్టాన్ని ఆపలేము’’ అని పేర్కొంది.
