పోలీసులకు లంచం ఇవ్వబోయిన వైసీపీ నేతలు : కృష్ణా జిల్లాలో టీడీపీ వైసీపీ గొడవ

  • Published By: chvmurthy ,Published On : February 6, 2019 / 03:59 PM IST
పోలీసులకు లంచం ఇవ్వబోయిన వైసీపీ నేతలు : కృష్ణా జిల్లాలో టీడీపీ వైసీపీ గొడవ

విజయవాడ: కృష్ణాజిల్లా మైలవరంలో రాజకీయాలు హీట్‌ పెంచుతున్నాయి. ఇక్కడ టీడీపీ వర్సెస్‌ వైసీపీగా పోరు కొనసాగుతోంది. వైసీపీ నేతలు స్థానిక పోలీసులకు ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ మైలవరం ఇంచార్జి కృష్ణప్రసాద్‌ అనుచరుడు రామారావు ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేశాడని జీ.కొండూరు ఎస్సై తన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. మరోవైపు మంత్రి ఉమా ఒత్తిళ్ల కారణంగానే ఇలా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని వైసీపీ కౌంటర్‌ ఇస్తోంది. మైలవరం సీఐ అక్రమాలపై డీఎస్పీకి ఫిర్యాదు చేసినందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కృష్ణప్రసాద్‌ ఆరోపిస్తున్నారు. 

ఇదంతా  దేవినేని ఉమా ఆడిస్తున్న డ్రామా అని మైలవరం వైసీపీ ఇంచార్జి వసంత కృష్ణప్రసాద్ కొట్టి పారేశారు. ఎన్నికలకు ఇంకా 3 నెలల టైమ్ ఉందని, ఇప్పటినుంచి పోలీసులకు లంచాలు ఇస్తూ కూర్చోరని, ఉన్నతాధికారులు మంత్రికి భయపడి ఇలాంటి కేసులు పెడితే భయపడేది లేదని కృష్ణప్రసాద్ అన్నారు. డబ్బులు ఇస్తున్నట్లు పోలీసుల దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ ఉంటే వెంటనే బయట పెట్టాలని కృష్ణప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు.