Asia Cup 2022: నేటి నుంచి ఆసియా కప్ టీ20 టోర్నీ.. అందరిచూపు భారత్, పాక్ మ్యాచ్‌పైనే

క్రికెట్ సమరానికి వేళైంది.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆరు జట్లు పాల్గోనున్న ఈ టోర్నీలో 16రోజుల్లో మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు రేపు ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే సమరం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Asia Cup 2022: నేటి నుంచి ఆసియా కప్ టీ20 టోర్నీ.. అందరిచూపు భారత్, పాక్ మ్యాచ్‌పైనే

Asia Cup-2022

Asia Cup 2022: క్రికెట్ సమరానికి వేళైంది.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆరు జట్లు పాల్గోనున్న ఈ టోర్నీలో 16రోజుల్లో మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి. శనివారం రాత్రి 7.30గంటలకు శ్రీలంక వర్సెస్ ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలిపోరు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు ఆసియా కప్ ను 14 సార్లు నిర్వహించారు. 1984 నుంచి 2018 మధ్య ఈ టోర్నమెంట్ లు జరిగాయి. అత్యధికంగా ఏడు సార్లు భారత్ విజేతగా నిలవగా, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు ట్రోపీని అందుకున్నాయి.

Asia Cup 2022: రేపటి నుంచే ఆసియా కప్.. ప్రాక్టీసు చేసిన తర్వాత కిక్ స్కూటర్‌పై రోహిత్ శర్మ ఎంజాయ్.. వీడియో

ఆసియా కప్-2022లో డిఫెండింగ్ చాంపియన్ గా భారత్ బరిలోకి దిగుతోంది. 2018లో వన్డే ఫార్మాట్ లో జరిగిన టోర్నీలో రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమిండియా టైటిల్ సాధించింది. 2016లో కూడా ప్రపంచ కప్ కు కొద్ది రోజుల ముందు ఈ టోర్నీని టీ20 ఫార్మాట్ లోనే నిర్వహించారు.  ఈసారికూడా టీ20 ప్రపంచ కప్ కు ముందు ఈ టోర్నీ జరగనున్న నేపథ్యంలో అన్ని జట్లు తమ సత్తాను చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.

Asia Cup 2022: బంతులను జోరుగా బాదుతూ, నెట్స్‌లో సాధన చేస్తూ కొహ్లీ బిజీబిజీ.. వీడియో

ఆసియా కప్ టోర్నీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేంది భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య పోరే. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ రెండు జట్ల మధ్య జరిగే సమరంకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఈసారి టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. నేడు టోర్నీ ప్రారంభం కానుండగా రేపు రాత్రి భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్ -4 కు అర్హత సాధిస్తే మరోసారి అక్కడ తలపడతాయి. గత ఏడాదిగా నిలకడగా విజయాలు సాధిస్తున్న పాక్ మంచి ఫామ్ లో ఉంది. చివరగా పదేళ్ల క్రితం (2012) ఆసియా కప్ గెలిచిన ఆ జట్టు ఈసారి సత్తాచాటి టోర్నీలో విజేతగా నిలిచేందుకు పాక్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇండియా ఆటగాళ్లు సైతం మంచి ఫామ్ లో ఉండటంతో రేపు జరిగే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య పోరు క్రికెట్ అభిమానులకు మంచి కిక్‌ను ఇవ్వనుంది.