పాండ్యా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మాజీ ప్రేయసి
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ ప్రేయసి కూడా అతనికి చురకలు అంటించింది. కరణ్ విత్ కాఫీ షో టీవీ కార్యక్రమంలో నోరు జారిన పాండ్యా ఇప్పటికే రెండు మ్యాచ్ల నుంచి సస్పెన్షన్కు గురై మరో తీర్పు కోసం వేచి చూస్తున్నాడు. కేసు రోజుకొక మలుపు తిరుగుతూ తుది తీర్పును సందిగ్ధంలో పడేసింది. ఇదిలా ఉంచితే, హార్దిక్ సోదరుడు కృనాల్ వివాహ వేడుకకు హాజరై కెమెరాల కళ్లు జిగేల్మనిపించిన ఎల్లీ అవరామ్ కూడా పాండ్యా వైఖరిపై నిప్పులు చెరిగింది.
ఈ వివాదం కారణంగా 2 మ్యాచ్ల నిషేదంతో పాటు పూర్తి ఐపీఎల్కు దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు. వివాదం ముదిరిన కొద్దీ శిక్ష తీవ్రత కూడా ఎక్కువగానే ఉండనుంది. కరణ్ షో పాల్గొన్న పాండ్యా, రాహుల్లు క్లబ్లలో ఉండే మహిళల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో వారిద్దరూ శిక్షార్హులంటూ బీసీసీఐ చీఫ్ వినోద్ రాయ్ రెండు మ్యాచ్ల నిషేదం విధించింది. ఆ శిక్ష సరిపోదంటూ విషయాన్ని లీగల్ సెల్కు పంపింది. అది కాస్తా సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో అంబుడ్స్మన్ వరకూ వెళ్లింది.
ఈ వివాదంలో పాండ్యాను సమర్థిస్తారా.. అని అడిగిన ప్రశ్నకు ఎల్లీ మాట్లాడుతూ.. హార్దిక్ ఇటువంటి వాడని అనుకోలేదు. నేను అది విన్న తర్వాత ఆశ్చర్యానికి గురైయ్యాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అతణ్ని అస్సలు సమర్థించను. అతని వ్యక్తిత్వం మార్చుకోవాలి. నేను వాళ్లు సస్పెండ్ అయ్యారని విన్నాను. దాని పట్ల బాధపడటం లేదు. ఎవరికైనా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినప్పుడు అదృష్టంగా భావించాలి. వారిని ఎంతో మంది అనుసరిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి’ అని ముగించింది.