Rishabh Pant: రిషబ్ పంత్.. ఎంఎస్ ధోనీ లాంటోడనుకున్నా – ఇంజమామ్

న్యూజిలాండ్ తో టీమిండియా ఆడిన తొలి టీ20లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. శుభారంభాన్ని నమోదు చేసిన టీమిండియాలో రిషబ్ పంత్ ప్రదర్శన చర్చనీయాంశమైంది.

Rishabh Pant: రిషబ్ పంత్.. ఎంఎస్ ధోనీ లాంటోడనుకున్నా – ఇంజమామ్

Rishabh Pant

Rishabh Pant: న్యూజిలాండ్ తో టీమిండియా ఆడిన తొలి టీ20లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. శుభారంభాన్ని నమోదు చేసిన టీమిండియాలో రిషబ్ పంత్ ప్రదర్శన చర్చనీయాంశమైంది. అగ్రెసివ్ గా ఆడే పంత్.. 17బంతులకు 17 కొట్టడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హఖ్ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.

తాను రిషబ్ పంత్ ను ఎంఎస్ ధోనీ అంతటోడు అనుకున్నానని.. 5వ స్థానంలో లేదా 6వ స్థానంలో వచ్చి అబ్బురపరుస్తాడనుకుంటే నిరాశపరిచాడని కామెంట్ చేశాడు.

‘రిషబ్ పంత్ పై నాకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రెండేళ్ల ప్రదర్శనపై చాలా సార్లు మంచి రేటింగ్ ఇచ్చాను. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో బాగా ఆడాడు. టాపార్డర్ ఫెయిల్ అయినప్పుడు ధోనీ మాదిరి జట్టును 5వ స్థానంలో లేదా 6వ స్థానంలో వచ్చి కాపాడతాడనుకున్నా. అంత సత్తా ఉన్నోడే.. కానీ, వరల్డ్ కప్ లో నా అంచనాలను అందుకోలేకపోయాడు’ అని ఇంజమామ్ ఉల్ హఖ్ యూట్యూబ్ ఛానెల్ లో చెప్పాడు.

……………………………………………..: ఢిల్లీ సీఎంను కలిసిన రెజ్లర్ గ్రేట్ ఖలీ.. ఆప్ గురించి చర్చలు

‘ఒత్తిడిలో ఉన్న సమయంలోనూ బాగా రాణించాడు. ప్రస్తుత మ్యాచ్ లో 17బంతులకు 17కొట్టి నిరాశపరిచాడు. అతను రియలైజ్ అయి గేమ్ ను మరింత ఇంప్రూవ్ చేసుకుంటాడనుకుంటున్నా’ అని అన్నాడు.