T20 World Cup 2022: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ 50వ టీ20 మ్యాచ్

ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా కాసేపట్లో భారత్-జింబాబ్వే మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఆడుతున్న 50వ టీ20 మ్యాచ్ ఇది. టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్ కు చేరింది. నేడు జరిగే మ్యాచు నామమాత్రమే.

T20 World Cup 2022: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ 50వ టీ20 మ్యాచ్

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా కాసేపట్లో భారత్-జింబాబ్వే మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఆడుతున్న 50వ టీ20 మ్యాచ్ ఇది. టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్ కు చేరింది. నేడు జరిగే మ్యాచు నామమాత్రమే.

గ్రూప్-బీలో టీమిండియాకు 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచులో గెలిస్తే 8 పాయింట్లు దక్కుతాయి. గ్రూప్-ఏలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఏడేసి పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకున్నారు.

భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, హర్ష్ దీప్ సింగ్, షమీ.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..