India vs West Indies: టీ20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్
భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య నేటి నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్ నుంచి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను తప్పించిన భారత సెలెక్టర్లు ఆ స్థానంలో సంజూ శాంసన్ను తీసుకున్నారు. టీమిండియాతో కేఎల్ రాహుల్ మైదానానికి కూడా వెళ్ళలేదు. ఈ సిరీస్ మొత్తం అతడు ఆడే అవకాశాలు లేవు.
India vs West Indies: భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య నేటి నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్ నుంచి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను తప్పించిన భారత సెలెక్టర్లు ఆ స్థానంలో సంజూ శాంసన్ను తీసుకున్నారు. టీమిండియాతో కేఎల్ రాహుల్ మైదానానికి కూడా వెళ్ళలేదు. ఈ సిరీస్ మొత్తం అతడు ఆడే అవకాశాలు లేవు.
ఇటీవలే కరోనా నుంచి కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. అతడు విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ వైద్య బృందం సూచించింది. దీంతో అతడు టీ20 సిరీస్లో ఆడడం లేదు. ఈ సిరీస్లో ఆడే ఆటగాళ్ళ జాబితాలో ముందుగా కేఎల్ రాహుల్ పేరును ప్రకటించినప్పటికీ, అతడిని తప్పించాల్సి వచ్చిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ స్క్వాడ్లో సంజూ శాంసన్ కూడా ఉన్నాడు. కాగా, ఇవాళ రాత్రి 8 గంటలకు భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.
టీ20 టీమిండియా స్క్వాడ్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాంత్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీ బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అన్వేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
borewell: బోరుబావిలో పడి 60 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన బాలిక.. 5 గంటల్లో బయటకు తీసిన జవాన్లు