టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఇదే: ఆంధ్రలోనే ఫస్ట్ మ్యాచ్.. రాహుల్ అవుట్

  • Published By: vamsi ,Published On : September 12, 2019 / 12:50 PM IST
టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఇదే: ఆంధ్రలోనే ఫస్ట్ మ్యాచ్.. రాహుల్ అవుట్

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తర్వాత దక్షిణాఫ్రికాతో తలపడబోతుంది. మూడు టెస్ట్ ల సిరీస్ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. విండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌కు జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్ శర్మకు దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు అవకాశం ఇచ్చింది. వరుసగా విఫలవుతున్న కేఎల్ రాహుల్‌కి మాత్రం టెస్ట్ టీమ్ లో ఈసారి చోటు దక్కలేదు. జట్టును ప్రకటించిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మకు ఓపెనర్‌గా అవకాశం ఇస్తున్నట్టు వెల్లడించాడు.

అలాగే, ఇద్దరు వికెట్ కీపర్లు రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహాలను జట్టులోకి తీసుకున్నారు. యువ ఆటగాడు శుభమన్ గిల్‌కు టీమ్ లో చోటు దక్కింది. అక్టోబర్ 2వ తేదీన విశాఖపట్నంలోని రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో గాంధీ మండేలా ట్రోఫీ టెస్ట్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.

భారత జట్టు: 
విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్.