ఐపిఎల్ 2020 కొత్త షెడ్యూల్: ఫస్ట్ మ్యాచ్ ముంబై, చెన్నై మధ్యనే

  • Published By: vamsi ,Published On : September 6, 2020 / 06:19 PM IST
ఐపిఎల్ 2020 కొత్త షెడ్యూల్: ఫస్ట్ మ్యాచ్ ముంబై, చెన్నై మధ్యనే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 13 వ సీజన్ కొత్త షెడ్యూల్ విడుదల అయ్యింది. సెప్టెంబర్ 19వ తేదీన అబుదాబిలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ముంబై ఇండియన్స్ (MI) ల మధ్య లీగ్ యొక్క మొదటి మ్యాచ్ జరుగుతుంది అని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) తెలిపింది. భారత సమయం ప్రకారం, ఈ మ్యాచ్ రాత్రి 7:30గంటలకు జరగనుంది.

సీజన్‌లో 10 డబుల్ హెడ్డర్‌లు:
కొత్త షెడ్యూల్ ప్రకారం, ఐపిఎల్ 2020లో మొత్తం 10 డబుల్-హెడ్డర్లు ఆడవలసి వస్తున్నాయి. మరియు రెండు మ్యాచ్‌లు ఆడిన రోజున, మొదటి మ్యాచ్ భారత సమయం మధ్యాహ్నం 03:30 గంటలకు ప్రారంభం అవుతుంది. లీగ్ దశలో గరిష్టంగా 24 మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి. ఇవే కాకుండా అబుదాబిలో 20, షార్జన్‌లో 12 మ్యాచ్‌లు ఆడనున్నారు. అయినప్పటికీ, ప్లే-ఆఫ్స్ మరియు ఫైనల్ మ్యాచ్‌లకు మైదానాలు ఎంపిక చేయలేదు.

ఐపిఎల్ 2020 కోసం ఏడుగురు కామెంటేటర్ల పేర్లను కూడా బిసిసిఐ ఖరారు చేసింది. సునీల్ గవాస్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, మురళి కార్తీక్, దీప్ దాస్‌గుప్తా, అంజుమ్ చోప్రా, రోహన్ గవాస్కర్, హర్ష భోగ్లే ఇందులో ఉన్నారు. ఈ దిగ్గజాలన్నీ సెప్టెంబర్ 10వ తేదీన UAEకి బయలుదేరుతాయి. వారిని రెండు ప్యానెల్లుగా విభజించారు. మొదటి ప్యానెల్ దుబాయ్ మరియు షార్జాలో ఉంటుంది, రెండవ ప్యానెల్ అబుదాబిలో ఉంటుంది.