ఇండియా ప్రైడ్…సింధుని అభినందించిన మోడీ
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచి దేశం గర్వపడేలా చేసిన పీవీ సింధు ఇవాళ(ఆగస్టు-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్ గోపీచంద్లను మోడీ అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ట్విటర్ అకౌంట్ లో షేర్ చేశారు. ‘
బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన ఛాంపియన్ సింధు. ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్లో ఇలాంటి ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ మోడీ ట్వీట్ చేశారు. అంతకుముందు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుని సింధు కలిశారు. ఈ సందర్భంగా సింధుని ఆయన సత్కరించారు.
భారత స్టార్ క్రీడాకారిణి సింధు ప్రపంచ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రాకార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్స్లో ఐదో సీడ్ సింధు 21-7,21-7తో మూడో సీడ్ నొజొమి ఒకుహర(జపాన్)ను చిత్తు చేసి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.
PM Narendra Modi: India’s pride, a champion who has brought home a Gold and lots of glory. Happy to have met PV Sindhu. Congratulated her and wished her the very best for her future endeavours. pic.twitter.com/NJp2YU7bOp
— ANI (@ANI) August 27, 2019