RCBvsMI: బెంగళూరు బొనాంజా.. ముంబై టార్గెట్ 172

RCBvsMI: బెంగళూరు బొనాంజా.. ముంబై టార్గెట్ 172

సీజన్ ఆరంభమైన 25 రోజులకు తొలి విజయం అందుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో మ్యాచ్ లోనూ అదే హవా కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి ముంబైకు 172 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. 

ఆఖరి మ్యాచ్ నుంచి ఫామ్ అందుకున్న డివిలియర్స్ ఈ సారి కూడా సత్తా చాటాడు. కెప్టెన్ కోహ్లీ(8)పరుగులతో నిరాశపర్చినప్పటికీ డివిలియర్స్(75; 51 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సులు)మొయిన్ అలీ(50; 32 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులు)తో జట్టుకు చక్కటి స్కోరు అందించారు. మిగిలిన బ్యాట్స్ మెన్ పార్థివ్ పటేల్(28), మార్సస్ స్టోనిస్(0), అక్షదీప్ నాథ్(2), పవన్ నేగీ(0), సిరాజ్(0), ఉమేశ్ యాదవ్(0) పరుగులు మాత్రమే చేయగలిగారు.