T20 World Cup-2022: టీ20 ప్రపంచ కప్‌లో ఈ 4 జట్లు సెమీఫైనల్ వెళ్తాయి!: సచిన్

సెమీ ఫైనల్స్ కు భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వెళ్లే అవకాశం ఉందని సచిన్ చెప్పారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల పరిస్థితి అంతగా బాగోలేదని అన్నారు. భారత్ కు టీ20 ప్రపంచ కప్ గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. టీమిండియా అన్ని విధాలుగానూ పటిష్ఠంగా ఉందని చెప్పారు.

T20 World Cup-2022: టీ20 ప్రపంచ కప్‌లో ఈ 4 జట్లు సెమీఫైనల్ వెళ్తాయి!: సచిన్

T20 World Cup-2022: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో సెమీ ఫైనల్స్‌కి ఏయే జట్లు వెళ్తాయన్న విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తన అంచనాను తెలిపారు. అందులో పాకిస్థాన్ కూడా ఉంది. అయితే, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు లేవు. ప్రపంచ కప్ ను భారత్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.

సెమీ ఫైనల్స్ కు భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వెళ్లే అవకాశం ఉందని ఆయన చెప్పారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల పరిస్థితి అంతగా బాగోలేదని అన్నారు. భారత్  టీ20 ప్రపంచ కప్ గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. టీమిండియా అన్ని విధాలుగానూ పటిష్ఠంగా ఉందని చెప్పారు.

ఈ ప్రపంచ కప్ కు జస్ప్రిత్ బుమ్రా దూరమైన విషయంపై సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ… జట్టులోని ఉత్తమ బౌలర్లలో ఒకడిగా ఉన్న ఆటగాడు ఆడకపోతే ఆ ప్రభావం టీమ్ పై ఉంటుందని అన్నాడు. అయితే, అతడి స్థానంలో ఆడుతున్న మొహమ్మద్ షమీ కూడా అనుభవం ఉన్న, సమర్థమైన బౌలర్ అని సచిన్ చెప్పాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..