A Fan gifted Kohli: కోహ్లీ మైదానంలోకి వెళ్తుంటే ఆపి.. బహుమతి ఇచ్చిన అమ్మాయి.. వీడియో వైరల్

 భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఓ అమ్మాయి బహుమతి అందించింది. స్వయంగా గీసిన కోహ్లీ చిత్రాన్ని అతడికి ఇచ్చింది. మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో నిన్న భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు మైదానంలోకి వెళ్తున్న సమయంలో విరాట్ కోహ్లీ వద్దకు ఓ అమ్మాయి వచ్చింది. స్వయంగా గీసిన పెయింటింగ్ ను కోహ్లీకి ఇచ్చి ఫొటో దిగింది.

A Fan gifted Kohli: కోహ్లీ మైదానంలోకి వెళ్తుంటే ఆపి.. బహుమతి ఇచ్చిన అమ్మాయి.. వీడియో వైరల్

A Fan gifted Kohli

A Fan gifted Kohli: భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఓ అమ్మాయి బహుమతి అందించింది. స్వయంగా గీసిన కోహ్లీ చిత్రాన్ని అతడికి ఇచ్చింది. మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో నిన్న భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు మైదానంలోకి వెళ్తున్న సమయంలో విరాట్ కోహ్లీ వద్దకు ఓ అమ్మాయి వచ్చింది. స్వయంగా గీసిన పెయింటింగ్ ను కోహ్లీకి ఇచ్చి ఫొటో దిగింది.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. కాగా, ఆసియా కప్ లో భారత అభిమానులను నిరాశపర్చిన టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. అయితే, బ్యాటింగ్ అద్భుతంగా చేసి 208 పరుగులు సాధించినప్పటికీ ఫీల్డింగ్ లో విఫలం కావడంతో టీమిండియా ఓడిపోయింది. మిగతా రెండు మ్యాచుల్లో టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Punjab Cricket Association (@pcacricketassociation)