Godavari : భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం..చివరి ప్రమాద హెచ్చరిక జారీ

ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. తెల్లవారుజామున 4 గంటల వరకు 11,62,923 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12.80 అడుగులకు చేరింది. ఉదయం 6 గంటల వరకు 12,10,532 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు.

Godavari : భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం..చివరి ప్రమాద హెచ్చరిక జారీ

Godavari

Godavari rains : తెలంగాణ, ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులతో పోలిస్తే సోమవారం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53.4 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం ఆలయ మాడవీధులు, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్సును వరద చుట్టుముట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సమీప మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 597 మందిని అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు.

గోదావరి వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌.. ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కిన్నెరసాని ఉధృతితో బూర్గంపాడు మండల కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. దుమ్ముగూడెం బ్యారేజీకి ఏకంగా 14.45లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. తుపాకులగూడెం బ్యారేజీకి 11.69 లక్షల క్యూసెక్కులు, కాళేశ్వరంలోని మేడిగడ్డ 8.50లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీలోకి లక్షా 95వేల క్యూసెక్కల వరద వస్తోంది.

AP Rains : ఏపీలో విస్తారంగా వర్షాలు-నిండుతున్న జలాశయాలు
ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. తెల్లవారుజామున 4 గంటల వరకు 11,62,923 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12.80 అడుగులకు చేరింది. ఉదయం 6 గంటల వరకు 12,10,532 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13.20 అడుగులకు చేరింది. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు 175 గేట్లు ఎత్తివేశారు.

లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 6 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఐదు లక్షల ఎకరాల్లో పంటలపై వానల ప్రభావం పడినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 చెరువులకు గండ్లు పడ్డాయి.