Mother Son Kill : కోవిడ్ తో తల్లి మరణించిన 24 గంటల్లోనే కొడుకు మృతి

సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. కోవిడ్ తో తల్లి, కొడుకు మృతి చెందారు.

Mother Son Kill : కోవిడ్ తో తల్లి మరణించిన 24 గంటల్లోనే కొడుకు మృతి

Covid

Mother and son killed : సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. కోవిడ్ తో తల్లి, కొడుకు మృతి చెందారు. పాలకవీడు మండలం జానపహడ్ కు చెందిన ఓ కుటుంబంలో ఆరుగురు కరోనా వైరస్ బారిన పడగా.. తల్లి, కుమారుడు 24 గంటల వ్యవధిలోనే కన్నుమూశారు.

సిమెంటు ఫ్యాక్టరీలో పనిచేసే నర్రా లక్ష్మీనారాయణ(45)కు 15 రోజుల క్రితం పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఐదారు రోజులు హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఆ క్రమంలో ఆయన తండ్రి, తల్లి సీతారావమ్మ (68), భార్య, కుమార్తె, సోదరుడూ కరోనా బారిన పడ్డారు.

సీతారావమ్మ(68)ను నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందారు.

అయితే, తల్లి మరణించిన 24 గంటల్లోనే లక్ష్మీనారాయణ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మిగిలిన నలుగురు హోం ఐసొలేషన్ లో ఉన్నారు.