కుల, మత రహిత సామూహిక స్మశాన వాటికలు : సీఎం కేసీఆర్ 

తెలంగాణలో వందశాతం వైకుంఠధామాలు నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. స్మశాన వాటికలు, డంప్ యార్డులపై దృష్టి పెట్టామని చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : March 13, 2020 / 07:53 AM IST
కుల, మత రహిత సామూహిక స్మశాన వాటికలు : సీఎం కేసీఆర్ 

తెలంగాణలో వందశాతం వైకుంఠధామాలు నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. స్మశాన వాటికలు, డంప్ యార్డులపై దృష్టి పెట్టామని చెప్పారు.

తెలంగాణలో వందశాతం వైకుంఠధామాలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. స్మశాన వాటికలు, డంప్ యార్డులపై దృష్టి పెట్టామని చెప్పారు. కుల రహిత, మత రహిత సామూహిక దహన, స్మశాన వాటికలతో కూడుకుని ఉన్న గ్రామాలను చూస్తామని చెప్పారు. వాటికి పది లేదా 20 కోట్ల రూపాయలు.. ఎన్నికోట్ల నిధులైనా ఇస్తామని చెప్పారు. 12, 751 గ్రామాల్లో చెత్త విసర్జన కేంద్రాలు, సామూహిక దహన వాటికలు, మంచినీటి సప్లై, ట్రాక్ట్రర్లు కలిగి ఉన్నాయన్నారు.(చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచ్ పదువులు ఊడుతాయ్ : సీఎం కేసీఆర్ )

రాష్ట్రంలో 3వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. భారత్ లో తెలంగాణ తప్ప మిగిలిన రాష్ట్రాలేవి 3వేలకు పైగా గ్రామ పంచాయతీలు చేయలేదన్నారు. గిరిజనుల సెంటిమెంట్ గౌరవించి వారి ఆహారం, ఆహార్యం, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి, ఆత్మగౌరవం, వారి పరిరక్షణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వమే మొట్టమొదటిసారిగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని చెప్పారు. 

రాష్ట్రంలో 500 వందలు అంతకు తక్కువ జనాభా కలిగి ఉన్న గ్రామాలు 899 ఉన్నాయని తెలిపారు. మిగిలినవన్ని 500 పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలే ఉన్నాయన్నారు. 500 జనాభా కల్గినవి 20 గ్రామ పంచాయతీలు, 400 నుంచి 499 జనాభా కల్గినవి 523 గ్రామ పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. వాటికి ఐదేళ్లలో కలిపి 36 లక్షలు వస్తున్నాయని చెప్పారు.

300 నుంచి 399 జనాభా కల్గినవి 292 గ్రామ పంచాయతీలు ఉన్నాయని…వాటికి 28 లక్షలు వస్తున్నాయని తెలిపారు. 200 నుంచి 299 వరకు జనాభా కల్గినవి 54గ్రామ పంచాయతీలు ఉన్నాయని..వాటికి రూ.20 లక్షలు నిధులు వస్తున్నాయని తెలిపారు. దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమన్నారు. 

See Also | హైదరాబాద్ టూ కర్ణాటక: కరోనాతో చనిపోయిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడు