Telangana BJP : 40మందితో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం..! రేపు రాత్రికి రిలీజ్?

టికెట్ల కేటాయింపులో మహిళలకు, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు జరిగింది. BJP First List Ready

Telangana BJP : 40మందితో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం..! రేపు రాత్రికి రిలీజ్?

Telangana BJP First List Ready

Telangana BJP First List Ready : తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ. రేపు(అక్టోబర్ 19) ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇవాళ(అక్టోబర్ 18) రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు రాత్రి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 40మందితో తొలి జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు జరిగింది. టికెట్ల కేటాయింపులో మహిళలకు, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ అగ్రనేతలతో జరిగే సమావేశంలో తెలంగాణ ఎన్నికల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అనే అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది.

Also Read : అసెంబ్లీ బరిలోకి దిగమంటున్న బీజేపీ సీనియర్లు.. వారిద్దరికి మినహాయింపు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అందరికన్నా ముందుగా తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేసింది. అంతేకాదు గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వరుసగా పర్యటనలు చేస్తున్నారు. భారీ బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ నే గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు కేసీఆర్.

Also Read : ఈటల సతీమణి జమున రాజకీయ ఆరంగేట్రం చేస్తారా?

ఇక కాంగ్రెస్ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు.