Telangana Covid Terror Update : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.(Telangana Covid Terror Update)

Telangana Covid Terror Update : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు

Telangana Covid

Telanganan Covid Terror Update : తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా రెండో రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. మంగళవారం రాష్ట్రంలో 403 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 434కు పెరగడం టెన్షన్ పెట్టిస్తోంది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 27వేల 754 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 434 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 292 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 71, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 129 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.(Telangana Covid Terror Update)

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 97వేల 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 90వేల 347 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 680కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే(2,375) నుంచి 2680కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111. క్రితం రోజు రాష్ట్రంలో 26వేల 704 కరోనా టెస్టులు చేయగా.. 403 మందికి పాజిటివ్ గా తేలింది.

Bharat Biotech: నాజల్ వ్యాక్సిన్ ట్రయల్స్ చేసుకున్న భారత్ బయోటెక్

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని.. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

అటు దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కొవిడ్ కేసులు మళ్లీ 12 వేలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 12వేల 249 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 13 మంది కొవిడ్ తో మరణించారు. మొన్న 9,923 కొత్త కేసులు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 12 వేలకు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం. అయితే, మరణాల సంఖ్య మాత్రం కొద్దిగా తగ్గింది. మొన్న 17 మంది మృతి చెందారు.(Telangana Covid Terror Update)

Corona Vaccine : ఆరు నెలల శిశువుకు అందుబాటులోకి కరోనా టీకా

కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం 81వేల 687 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.94 శాతంగా ఉంది. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి మరో 9వేల 682 మంది కోలుకున్నారు. నేటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,27,25,055కి చేరుకుంది.(Telangana Covid Terror Update)

భారత్ లో ఇప్పటిదాకా 196.45 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది. 12-14 మధ్య వయస్కులకు కొవిడ్ వ్యాక్సినేషన్ మార్చి 16న మొదలవగా.. ఆ వయసు గల వారిలో ఇప్పటిదాకా 3 కోట్ల 58 లక్షల 99 వేల 199 మందికి మొదటి డోసు ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.