TSRTC: తెలంగాణ నుంచి ఏపీకి ఆ బస్సులు మాత్రమే వెళ్లొచ్చు

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే బస్సులను తెలంగాణ ఆర్టీసీ క్యాన్సిల్ చేసింది. హైదరాబాద్‌ నుంచి వెళ్లే 250 బస్సులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

TSRTC: తెలంగాణ నుంచి ఏపీకి ఆ బస్సులు మాత్రమే వెళ్లొచ్చు

Tsrtc

TSRTC: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే బస్సులను తెలంగాణ ఆర్టీసీ క్యాన్సిల్ చేసింది. హైదరాబాద్‌ నుంచి వెళ్లే 250 బస్సులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు రిజర్వేషన్‌లను కూడా అధికారులు రద్దు చేశారు. దీంతో హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తదితర ప్రాంతాలతోపాటు కర్నూలు, శ్రీశైలం, బెంగళూరు వైపునకు బస్‌ సర్వీసులు నిలిచిపోయాయి.

బుధవారం వరకూ కొన్ని సర్వీసులను ఏపీకి నడిపినప్పటికీ గురువారం నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి వెళ్లే అన్ని బస్సులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారి వివరించారు. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

‘ఏపీలో కర్ఫ్యూకు ముందే బస్సులు అక్కడికి చేరుకోవలసి ఉంటుంది. ఉదయం అక్కడికి చేరుకున్న బస్సులు తిరిగి మధ్యాహ్నం 12 లోపు రాష్ట్ర సరిహద్దులను దాటాల్సి ఉంది. ఇది ఏమాత్రం సాధ్యం కాదు. మరోవైపు తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచే కర్ఫ్యూ అమలవుతున్న దృష్ట్యా ఏపీ నుంచి బయలు దేరిన బస్సులు రాత్రి 9 గంటలలోపు డిపోలకు చేరుకోవడం సాధ్యం కావడం లేదు’ అని అధికారి స్పష్టం చేశారు.

ఏపీ సరిహద్దు జిల్లాల బస్సులు మాత్రం మధ్యాహ్నం 12 లోపు ఆయా డిపోలకు చేరుకునే అవకాశం ఉంటే రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ఈ మేరకు కోదాడ నుంచి విజయవాడ వరకు 6 బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపుకు వెళ్లే 48 బస్సులు కూడా ఆపేశారు.