Wife Murder: భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్‌లోని మహిళను హతమార్చడమే కాకుండా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. అస్సాం రాష్ట్రం నుంచి జీవనోపాధి కోసం వచ్చిన మహానంద బిశ్వాస్ (24), పంప సర్కార్ (22) ప్రేమ్ నగర్‌లో నివాసం ఉంటున్నారు.

Wife Murder: భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

nalgonda murder

 

Wife Murder: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్‌లోని మహిళను హతమార్చడమే కాకుండా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. అస్సాం రాష్ట్రం నుంచి జీవనోపాధి కోసం వచ్చిన మహానంద బిశ్వాస్ (24), పంప సర్కార్ (22) ప్రేమ్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. జీవీకే మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబపోషణ సాగిస్తున్నారు.

మూడు రోజులుగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న తగాదాలు విషాదానికి దారితీశాయి. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో భార్యను నీళ్ల బకెట్లో ముంచి హత్య చేశాడు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నాంపల్లి రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించారు. ఆ డెడ్ బాడీలో దొరికిన డైరీలో భార్యను తానే హత్య చేశానని, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ లెటర్ రాసుకుని ఉంచినట్లు పోలీసులు కనుగొన్నారు.

Read Also: లైంగిక వేధింపులతో మహిళ ఆత్మహత్య

నాంపల్లి రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసులు ప్రేమ్ నగర్‌లోని వాళ్ల ఇంటిని కనుగొన్నారు. గదికి తాళం వేసి ఉండగా పగలగొట్టి మహిళ మృతదేహాన్ని ఒస్మానియా మార్చురీ తరలించారు.

క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి సాక్ష్యాలను సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పూర్తిస్థాయిలో వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు.