Redgram Cultivation : కందిలో ఎండుతెగులు ఉదృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

తెగుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మండలాల్లో, పూత, పిందె దశలో వున్న కంది పంటలో ఎండుతెగులు సోకటంతో, దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

Redgram Cultivation : కందిలో ఎండుతెగులు ఉదృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Redgram Cultivation

Updated On : September 22, 2023 / 12:12 PM IST

Redgram Cultivation : ఖరీఫ్ లో సాగుచేసిన కంది, వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కందిలో చీడపీడల ఉదృతి పెరింగింది.  ఈ సున్నిత దశలో  ఎండుతెగులు  ఆశించిన తీవ్రనష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు  కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి

READ ALSO : స్మార్ట్ సేద్యం.. యాప్ సాయంతో పంటలు… నూజివీడు త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘనత

ఖరీఫ్ కంది పంటకాలం రకాన్నిబట్టి 150 నుండి 180 రోజులు. జూలై నుంచి ఆగష్టు వరకు విత్తిన ఈ పంట చాలా ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో వుంది. డిసెంబరు నెలాఖరు వరకు పూత వృద్ధి చెందే అవకాశం వుంది. తెలంగాణలో నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఈ సారి కంది విస్తీర్ణం భాగా పెరిగింది.

READ ALSO : Safflower Cultivation : కుసుమలో అధిక దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన మెళకువలు

అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చేలల్లో నీరు నిలిచి చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎంతో శ్రమకోర్చి, పంటను ఈ దశకు తీసుకొచ్చిన రైతులకు, ఇప్పుడు తెగుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మండలాల్లో, పూత, పిందె దశలో వున్న కంది పంటలో ఎండుతెగులు సోకటంతో, దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రైతులు ఈ తెగులుపై నిఘా వుంచి వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి