ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్

Adityanath Das appointed as the AP new CS : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ నియామకం అయ్యారు. ఈ నెల 31న సీఎస్ గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం ( డిసెంబర్ 22, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సీఎస్ గా బాధ్యతలు నిర్వరిస్తున్న నీలం సాహ్ని పదవీకాలం ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు.
నెలాఖరున నీలం సాహ్ని రిటైర్ అయిన వెంటనే కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలను స్వీకరించనున్నారు. బీహార్ లో పుట్టిన ఆదిత్యనాథ్ 1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వచ్చే ఏడాది జూన్ లో దాస్ పదవీ విరమణ చేయనున్నారు. సీఎస్ రేసులో మరో ముగ్గురు అధికారులు ఉన్నప్పటికీ వారంతా కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో అధిత్యనాథ్ దాస్ వైపై సీఎం జగన్ మొగ్గు చూపారు.
దీంతోపాటు మరికొందరు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లో మార్పులు చేర్పులు చేశారు. ఆదిత్యనాథ్ దాస్ సీఎస్ గా నియమితులైన నేపథ్యంలో జలవనరుల శాఖ కార్యదర్శిగా శ్యామలరావును నియమించారు. ప్రస్తుతం ఆయన పురపాలక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిని వై.శ్రీలక్ష్మీని పురపాలక శాఖ కార్యదర్శిగా, కె.సునీతను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.