Padmavathi Express: ఆంధ్రప్రదేశ్లో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్ప్రెస్ బోగీ.. సికింద్రాబాద్ వెళ్లే 2 రైళ్ల వేళల్లో మార్పులు
అనంతరం అక్కడ రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశారు.

Padmavathi Express
Padmavathi Express- Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి (Tirupati) స్టేషన్ యార్డులో ఇవాళ సాయంత్రం పద్మావతి ఎక్స్ప్రెస్ బోగీ పట్టాలు తప్పింది. ఆ ఎక్స్ప్రెస్ బోగీలో ప్రయాణికులు ఎవరూ లేరు. ట్రైనుకి కోచ్లను అనుసంధానం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అనంతరం అక్కడ రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశారు. షంటింగ్ చేస్తుండగా పద్మావతి ఎక్స్ప్రెస్ బోగీ పట్టాలు తప్పిందని వివరించారు. ఈ ఘటనతో రెండు రైళ్ల వేళలను మార్చుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్ వెళ్లాల్సినవేనని తెలిపారు.
పద్మావతి ఎక్స్ప్రెస్ తో పాటు రాయలసీమ ఎక్స్ప్రెస్ ను రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు చెప్పారు. పద్మావతి ఎక్స్ప్రెస్ ను రాత్రి 7.45 గంటలకు, అలాగే, రాయలసీమ ఎక్స్ప్రెస్ ను రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు వివరించారు.
#WATCH | Andhra Pradesh | A coach of Padmavathi Express, which did not have any passengers onboard, derailed at Tirupati railway station this evening. The incident took place while the coaches were being connected to the train. Railway staff are conducting operations for coaches… pic.twitter.com/sbacc5EE6S
— ANI (@ANI) July 19, 2023
Russia : నది నుంచి ఆకాశం వరకూ.. బంగారు రంగులో నీటి ధార.. అమేజింగ్ వీడియో వైరల్