ఏపీలో కరోనా..24 గంటల్లో 238 కేసులు, ముగ్గురు మృతి

ఏపీలో కరోనా..24 గంటల్లో 238 కేసులు, ముగ్గురు మృతి

Updated On : January 2, 2021 / 6:57 PM IST

Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 238 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు చనిపోయారు. ఈ మేరకు 2021, జనవరి 02వ తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 48 వేల 518 శాంపిల్స్ పరీక్షించినట్లు, గడిచిన 24 గంటల్లో 279 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది.

శనివారం వరకు రాష్ట్రంలో 1,19,32,603 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది. మొత్తంగా ఏపీ రాష్ట్రంలో 8 లక్షల 69 వేల 650కి కరోనా కేసులు చేరుకున్నాయి. ప్రస్తుతం ఏపీలో 3 వేల 194 యాక్టివ్ కేసులు ఉండగా..8 లక్షల 69 వేల 650 మంది డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా  : – 

అనంతపురం : 11. చిత్తూరు 59. ఈస్ట్ గోదావరి : 15. గుంటూరు : 32. కడప : 16. కృష్ణా : 32. కర్నూలు : 11. నెల్లూరు : 04. ప్రకాశం : 06. శ్రీకాకుళం : 03. విశాఖపట్టణం : 21. విజయనగరం : 05. వెస్ట్ గోదావరి : 22. మొత్తం 238.