జనసేన జయకేతనం.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గ్లాసు ప్రభంజనం

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలిచిన జనసేన ఈసారి సునామీ సృష్టిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. 

జనసేన జయకేతనం.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గ్లాసు ప్రభంజనం

AP Elections 2024 Results Janasena Party shines

AP Elections 2024 Results Janasena Party: ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఫలితాల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నిచోట్ల ఆధిక్యంలో ఉంది. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ జనసేన పార్టీ సత్తా చాటుతోంది. అటు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లోనూ జనసేన ఆధిక్యంలో ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలిచిన జనసేన ఈసారి సునామీ సృష్టిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

ఈ ఫలితాలు ముందే ఊహించాం: బాలశౌరి
తాజా ఎన్నికల ఫలితాలు జగన్ పాలనపై ప్రజాగ్రహానికి నిదర్శనమని జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. అవినీతి, అక్రమాలతో వైఎస్ జగన్ అడ్డగోలుగా వ్యవహరించారని, జగన్ నియంతృత్వ పోకడలను ప్రజలు తట్టుకోలేక పోయారని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమని ప్రజలు నమ్మారని చెప్పారు. ఈ ఫలితాలు తాము ముందే ఊహించామని.. ప్రజా పాలనతో ప్రజలుకు మేలు, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాగా, మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో బాలశౌరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.