వారికి వందకోట్లు ఇస్తాం.. వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి : సీఎం చంద్రబాబు

Chandrababu : నవంబరు 13వ తేదీన ఇచ్చిన క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చిందని, క్వాంటం నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన

వారికి వందకోట్లు ఇస్తాం.. వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి : సీఎం చంద్రబాబు

Chandrababu

Updated On : December 23, 2025 / 1:08 PM IST

Chandrababu : ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఉంటుందని, ప్రస్తుతం అందరూ క్వాంటమ్ టెక్నాలజీ గురించే ఆలోచిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వేలాది టెక్ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో క్వాంటమ్ టాక్ నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేయబోతోందన్నారు.

Also Read : Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుడ్‌న్యూస్.. పీల్చుకునే ఇన్సులిన్ పౌడర్ వచ్చేసింది.. ఇంజక్షన్‌కు ఇక బైబై..

ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం.. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్‌ను క్వాంటం అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. సామర్ధ్యాలు, వేగం, కచ్చితత్వం లాంటివి క్వాంటం టెక్నాలజీ ద్వారా సాధించే అవకాశం ఉంటుందని అన్నారు.

ఓ ట్రాన్సఫర్మేషనల్ ఛేంజ్ క్వాంటం ద్వారా సాధించేందుకు ఆస్కారం ఉంది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను భారతీయులు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఏ సాంకేతికత అయినా విప్లవమైనా ఏపీ సారధ్యం వహిస్తుంది. ఎవరినీ అనుసరించదు అని చంద్రబాబు పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి చేస్తామని చెప్పారు. క్వాంటం నిపుణులు, క్వాంటం కంప్యూటర్లు, పరికరాలను ఏపీ నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తామని అన్నారు.

నవంబరు 13వ తేదీన ఇచ్చిన క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చిందని, క్వాంటం నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన ఒక్క ప్రకటన ద్వారా 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. నిపుణుల్ని తయారు చేసుకునేలా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని, క్వాంటం రంగంలో స్కిల్ రోడ్ మ్యాప్‌నే సిద్దం చేసుకున్నామని అన్నారు. లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంగానే వన్ ఐటీ, ఏఐ యూజ్ కేస్ ద్వారా వీటి విస్తృతిని పెంచుతున్నామని, క్వాంటం అల్గారిథమ్స్ నేర్చుకోవటం ద్వారా విద్యార్ధులు భవిష్యత్ నిపుణులుగా తయారవుతారని చంద్రబాబు చెప్పారు. విజన్‌ను అందిపుచ్చుకోవాలని విద్యార్ధులను కోరుతున్నానని, భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఏ అంశంలో అయినా ఏపీ ఫాస్ట్ లెర్నర్. అమరావతిలో క్వాంటం వ్యాలీని అద్భుతంగా నిర్మిస్తున్నామని, ఎకోసిస్టంగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు చెప్పారు.