AP Covid-19 Live Updates : ఏపీలో కొత్తగా 1,593 కరోనా కేసులు, 10మంది మృతి

  • Published By: sreehari ,Published On : November 13, 2020 / 06:16 PM IST
AP Covid-19 Live Updates : ఏపీలో కొత్తగా 1,593 కరోనా కేసులు, 10మంది మృతి

Updated On : November 13, 2020 / 6:17 PM IST

AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 8 లక్షలు దాటేశాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు.



రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 80,737 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 1,593 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 8,51,298లకు చేరాయి.



రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి 10 మంది మరణించారు. గత 24 గంటల్లో 2,178 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 8.24 లక్షల మంది డిశ్చార్జి అయ్యారు.



రాష్ట్రంలో ఇప్పటివరకూ 90,21,225 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 20,262 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,847కు చేరుకుంది.



ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల కృష్ణలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.