ఏపీలో కొత్తగా 2,783 కరోనా కేసులు నమోదు, 14 మంది మృతి

  • Published By: sreehari ,Published On : October 31, 2020 / 07:33 PM IST
ఏపీలో కొత్తగా 2,783 కరోనా కేసులు నమోదు, 14 మంది మృతి

Updated On : October 31, 2020 / 7:33 PM IST

AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 8 లక్షలు దాటేశాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు.



రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 82,045 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 2,886 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 8,17,679లకు చేరాయి.



రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి 14 మంది మరణించారు. గత 24 గంటల్లో 3,708 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.



రాష్ట్రంలో 7,92,083 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 80,28,905 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 24,575 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,690కు చేరుకుంది.



ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో ముగ్గురు, కృష్ణలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, అనంతపూర్‌లో ఒక్కరు, తూర్పుగోదావరిలో ఒక్కరు మరణించారు.