AP Covid-19 Live Updates : ఏపీలో 60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. పెరిగిన మరణాలు

  • Published By: sreehari ,Published On : October 3, 2020 / 07:40 PM IST
AP Covid-19 Live Updates : ఏపీలో 60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. పెరిగిన మరణాలు

Updated On : October 4, 2020 / 6:21 PM IST

AP Covid-19 Live Updates: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. శనివారంతో కరోనా పరీక్షల సంఖ్య 60 లక్షలు దాటేసింది.



మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కరోనా మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. 41 మంది కరోనాతో మరణించారు. కానీ, రికవరీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 7,798 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.



రాష్ట్రంలో గత 24 గంటల్లో 72,861 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 6,224 మందికి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 41 మంది మృతిచెందారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 60,21,395 శాంపిల్స్ పరీక్షించారు. ఏపీలో కరోనా కేసులు 7,13,014 లక్షలపైన దాటేశాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 5,941 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 55,282 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా 6,41,098 మంది (AP Covid Recovery cases) డిశ్చార్జ్ అయ్యారు.



ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల కృష్ణలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, కడపలో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.