ఏపీలో కరోనా తగ్గుముఖం : 6,349 మంది రికవరీ

AP Covid-19 Live Updates: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంటే 34 మంది కరోనాతో మరణించారు. కానీ, రికవరీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 6,349 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 66,769 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 5,120 మందికి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 34 మంది మృతిచెందారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 62,83,009 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. ఏపీలో కరోనా కేసులు 7,34,427 లక్షలపైన దాటేశాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 6,086 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 49, 513 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా 6,78,828 మంది (AP Covid Recovery cases) డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల తూర్పు గోదావరిలో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, చిత్తూరులో నలుగురు, కృష్ణలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, కడపలో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఒక్కరు మరణించారు.