AP High Court : గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను నిలిపివేసిన ఏపీ హైకోర్టు
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఏపీ హైకోర్టు నిలిపివేసింది. డిజిటల్ మూల్యాంకనానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించింది. ఫలితాలను పక్కన పెట్టాలని ఆదేశించింది.

Appsc
Group-1 Mains results : గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఏపీ హైకోర్టు నిలిపివేసింది. డిజిటల్ మూల్యాంకనానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను పక్కన పెట్టాలని ఏపీపీఎస్సీ ను ఆదేశించింది. మ్యాన్ వల్ గా మూల్యాంకనం చేసి ఫలితాలు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. మూడు నెలల్లో ఫలితాలను విడుదల చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో 8 పిటిషన్లు దాఖలయ్యాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. డిజిటల్ మూల్యాంకనం గురించి చివరి దశలో తెలిపారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ మూల్యాంకనం చేశారని, దీంతో ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
Telugu Academy : తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు
ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం ఎలా చేయిస్తుందని వాదించారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషనర్ వాదించారు. ఇంటర్వ్యూలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాగా నిబంధనల ప్రకారమే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మూల్యాంకనం గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఇరువురి వాదనలు విన్న కోర్టు గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ -1 ఇంటర్వ్యూతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేసింది. ఈ ఏడాది జూన్ 16న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ.. ధర్మాసనం ఎదుట ఏపీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది. మౌఖిక పరీక్షకు ఎంపికైన కొందరు అభ్యర్థులు కూడా అప్పీళ్లు వేశారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. మూడు నెలల్లో మాన్యువల్గా మూల్యాంకనం చేసి ఫలితాలు ఇవ్వాలని ఆదేశించింది.