ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం

ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రెండున్నర గంటలపాటు సాగింది.

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం

AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఈ సమావేశం రెండున్నర గంటలపాటు సాగింది. పలు అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను ప్రభుత్వం రూపొందించనుంది.

పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్ కు ప్రభుత్వ గ్యారెంటీకి కెబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయించింది.

Also Read : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి.. స్పీకర్‌తో భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైనా మంత్రివర్గం చర్చించింది. అధికారంలోకి వచ్చి నెల రోజులైన దృష్ట్యా పనితీరుపైనా సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైనా సమావేశంలో మంత్రులు చర్చించారు.