YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. వైఎస్ షర్మిలను సాక్షిగా చేర్చిన సీబీఐ, వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడి

హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, పెద్ద కారణం ఉండవచ్చని చెప్పారని తెలిపారు. అవినాశ్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చని, వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకుని ఉండవచ్చని తెలిపారని వెల్లడించారు.

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. వైఎస్ షర్మిలను సాక్షిగా చేర్చిన సీబీఐ, వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడి

YS Viveka Case (2)

YS Sharmila Witness : ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా చేర్చింది. ఆమెను 259వ సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. కోర్టు విచారణకు స్వీకరించడంతో ఈ వివరాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. తన వద్ద ఆధారాలు లేవు కానీ, రాజకీయ కారణంగానే హత్య జరిగిందని షర్మిల భావిస్తున్నట్లు వాంగూల్మం ఇచ్చారని సీబీఐ కోర్టుకు తెలిపింది.

హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, పెద్ద కారణం ఉండవచ్చని చెప్పారని తెలిపారు.
అవినాశ్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చని, వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకుని ఉండవచ్చని తెలిపారని వెల్లడించారు. హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని తన ఇంటికి వివేకా వచ్చారని, కడప ఎంపీగా పోటీ చేయాలని తనను అడిగారని, అవినాశ్ కు టికెట్ ఇవ్వకుండా ఎలాగైనా జగన్ ను ఒప్పిద్దామన్నానని చెప్పారని వాంగ్మూలంలో వివరించారు.

Andhra Pradesh : చనిపోయిందనుకున్న తల్లి కళ్లముందు ప్రత్యక్షం.. ఆనందంతో ఉప్పొంగిపోయిన కుమారులు

జగన్ కు వ్యతిరేకంగా తాను వెళ్లనని వివేకా ఆలోచించారని, తనకు జగన్ మద్దతు ఇవ్వరని తెలుసు కాబట్టి ఎంపీగా పోటీకి మొదట ఒప్పుకోలేదని, బాబాయ్ ఒత్తిడి మేరకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
ఎంపీగా వివేకానే పోటీ చేయకుండా మీపై ఎందుకు ఒత్తిడి తెచ్చారని సీబీఐ ప్రశ్నించగా, బహుశా ఎమ్మెల్సీగా ఓడిపోయినందున ఆసక్తి చూపకపోయి ఉండొచ్చని, విజయమ్మపై పోటీ చేశాక కొంతదూరం పెరిగిందని తెలిపారు.

ఆ కారణంగా ఎలాంటి టికెట్ దక్కకపోవచ్చని వివేకా భావించారని ఎమ్మెల్సీగా ఆయన ఓటమికి తనకు తెలిసినంత వరకు అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కొందరు సన్నిహుతులే కారణమని తెలిపారు. కుటుంబంలో అంతా బాగున్నట్లు కనిపించినా.. లోపల కోల్డ్ వార్ ఉండేదని షర్మిల వాంగ్మూలం ఇచ్చినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో వైఎస్ షర్మిల నుంచి సీఎం జగన్ అటెండర్ నవీన్ ను కలిపి మొత్తం 259 మంది వాంగ్మూలాలను సీబీఐ సేకరించింది.

Uttar Pradesh: సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇలాకాలో దారుణం.. వైస్ చాన్స్‭లర్, రిజిస్ట్రార్, పోలీసులను తీవ్రంగా కొట్టిన ఏబీవీపీ కార్యకర్తలు

గతేడాది అక్టోబర్ 7న ఢిల్లీలో షర్మిల వాంగూల్మం తీసుకుంది. వాటిని గత నెల జూన్ కోర్టుకు అంతజేసింది. వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఓఎస్ డీ పి.కృష్ణ మోహన్ రెడ్డి, రిటైర్డ్ సీఎస్ అజేయ కల్లం, వైసీసీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్ కుమార్ సాక్షులుగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది.