AP Assembly : ‘రా చూసుకుందాం’ అంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి సవాల్.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

ఏపీ అసెంబ్లీలో మీసం తిప్పటాలు, తొడ కొట్టటాలు వంటి దృశ్యాలతో సమావేశాలు సినిమాను తలపిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే మీసం తిప్పితే..మరో ఎమ్మెల్యే తొడకొట్టారు. రా చూసుకుందాం అంటూ రా చూసుకుందాం అంటూ సవాళ్లు విసుకున్నారు.

AP Assembly : ‘రా చూసుకుందాం’ అంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి సవాల్.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

Ambati Sawal To Balakrishna

AP Assembly sessions : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొంతసేపటికే టీడీపీ వర్సెస్ వైసీపీగా వాడి వేడిగా కొనసాగుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో సభ హోరెత్తింది. మరీ ముఖ్యంగా హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని దీనిపై చర్చ చేపట్టాలి అంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై వాయిదా తీర్మానానికి టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.

దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటలు తారాస్థాయికి వెళ్లాయి. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే సభ కొనసాగుతున్న క్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పారు. దీనిపై మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. మీసాలు సినిమాల్లో తిప్పుకో అసెంబ్లీలో కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు. ‘‘ రా చూసుకుందాం’’ అంటూ అంబటి బాలకృష్ణకు సవాల్ విసిరారు దీంతో సభ మరింత హీటెక్కింది. బాలకృష్ణ మాట తిప్పటం..అంబటి సవాళ్లు జరుగుతున్న క్రమంలో బాలకృష్ణను చూసి వైసీపీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి తొడకొట్టి సవాల్ చేశారు.

AP Assembly : అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ .. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి అంబటి

సభలో బాలకృష్ణ వ్యవహారంపై వైసీపీ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇలా సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ  వాయిదా అనంతరం.. టీడీఎల్పీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం అయ్యారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టుపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. స్పీకర్ పైకి పేపర్లు విసురుతూ నిరసన తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు కొట్టివేయాలని నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనతో సభలో అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని మంత్రి అంబటి మాట్లాడుతున్న క్రమంలో.. రండి చూసుకుందాం అంటూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేతితో సైగలు చేయడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

బాలకృష్ణ మీసాలు తిప్పుతూ రెచ్చగొడుతున్నారంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీసాలు సినిమాలో తిప్పు.. ఇక్కడ కాదు అంటూ బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సభలో తొడ కొట్టారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో సభను పది నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.